ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ కోసం భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూశారు. ఆ సిరీస్ తొలి సీజన్ హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లోనూ రిలీజైంది. ఆయా భాషల్లో ప్రేక్షకులు ఫ్యామిలీ మ్యాన్ చూసి ఆస్వాదించారు. ఐతే సెకండ్ సీజన్ మీద హిందీ వాళ్లే కాక తెలుగు వాళ్లు కూడా భారీ అంచనాలతో ఉన్నారు. తమ భాషలోనే సెకండ్ సీజన్ చూడాలని ఆశపడ్డారు. కానీ దీని మేకర్స్ రిలీజ్ రోజు పెద్ద షాకిచ్చారు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇది తెలుగు వాళ్లను నిరాశకు గురి చేసింది.
అమేజాన్ ప్రైమ్ ఇంతకుముందు మీర్జాపూర్ సెకండ్ సీజన్ విషయంలోనూ ఇదే చేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి తెలుగు వెర్షన్ రిలీజ్ చేసింది. కానీ ఆ సిరీస్ రెండో సీజన్కు ముందే నెగెటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత తెలుగు వాళ్లు పెద్దగా చూడలేదు.
ఐతే ఫ్యామిలీ మ్యాన్-2 సంగతి అలా కాదు. తొలి సీజన్కు దీటుగా మలి సీజన్ ఉండటంతో అదిరిపోయే టాక్ వచ్చింది. తెలుగులో ఈ సిరీస్ చూద్దామని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ గత ఏడాదే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎప్పుడో ముగించారు. తెలుగు డబ్బింగ్కు చాలానే టైం దొరికింది. అయినా సరే.. ఒకేసారి తెలుగులోనూ సిరీస్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారన్నది ప్రశ్న. ఇందుకు వేరే కారణాలున్నాయని అంటున్నారు.
ఫ్యామిలీ మ్యాన్-2 మీద తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి అన్ని భాషలతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేస్తే తమిళ జనాల నుంచి ఒకేసారి వ్యతిరేకత వ్యక్తమై ఎక్కడ సిరీస్ను ఆపేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న భయంతోనే కేవలం హిందీ వరకు రిలీజ్ చేశారంటున్నారు. దీని వల్ల తమిళంలో దీని రీచ్ తక్కువగా ఉంటుంది. కొంచెం వేడి తగ్గాక తెలుగు, తమిళంలో ఒకేసారి సిరీస్ను అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. మొదట హిందీతో పాటు తెలుగులోనూ సిరీస్ రిలీజ్ చేసి తమిళం వరకు ఆపితే.. అదొక వివాదంగా మారొచ్చు. అందుకే తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్లను కూడా హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. రెండు వారాల తర్వాత తెలుగు, తమిళ ఆడియోలు అందుబాటులో ఉండే అవకాశముంది.
This post was last modified on June 7, 2021 12:06 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…