రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టుల్లో చాలామంది ఒకప్పుడు తహతహలాడేవాళ్లు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్లు. శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి చిత్రాలతో అన్ని ఇండస్ట్రీల టాప్ స్టార్స్కు తనతో సినిమా చేయాలన్న కోరిక పుట్టించిన ఘనత వర్మ సొంతం. తెలుగులో చిరంజీవి సైతం వర్మతో ఓ సినిమా మొదలుపెట్టగా.. వర్మే దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఇక హిందీలో ఆమిర్ ఖాన్.. వర్మతో అతడి కెరీర్ ఆరంభంలోనే రంగీలా చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లలో వర్మను ఎక్కువగా నమ్మిందంటే అమితాబ్ బచ్చనే. వీరి కలయికలో అరడజనుకు పైగా సినిమాలు రావడం విశేషం. ఐతే అందులో సర్కార్ మాత్రమే పెద్ద విజయం సాధించింది.
సర్కార్ రాజ్, నిశ్శబ్ద్, రణ్, డిపార్ట్మెంట్, సర్కార్-3 సినిమాలు నిరాశ పరిచాయి. ఇందులో డిపార్ట్మెంట్, సర్కార్-3 చిత్రాలైతే పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఐతే వర్మ మీద ఎంతో గురి ఉన్న అమితాబ్.. ఫలితాలతో సంబంధం లేకుండా అతడితో పని చేస్తూనే వచ్చాడు. కానీ వర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలోనూ సర్కార్-3 చేసి తల బొప్పి కట్టించుకున్న అమితాబ్.. ఇక మళ్లీ ఈ దర్శకుడితో పని చేయడనే అంతా అనుకున్నారు. కానీ వర్మ మళ్లీ బిగ్-బిని ఇంప్రెస్ చేసి ఓ సినిమా చేయడానికి ఆయన నుంచి కమిట్మెట్ తీసుకున్నాడని బాలీవుడ్ మీడియా తాజాగా రిపోర్ట్ చేస్తోంది.
లాక్ డౌన్ టైంలో క్లైమాక్స్ అని, థ్రిల్లర్ అని నాసిరకం సినిమాలు తీసిన వర్మను ఇంకా అమితాబ్ నమ్మి సినిమా చేస్తున్నాడంటే షాకవ్వాల్సిందే. తన దగ్గరికి ఎంతోమంది ప్రతిభావంతులైన ఫిలిం మేకర్స్ నరేషన్ కోసం వస్తున్నారని.. అవన్నీ వినే సమయం కూడా ఉండట్లేదని.. చాలా ప్రత్యేకమైన పాత్రలు, సినిమాలనే ఎంచుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బిగ్-బి.. ఇప్పుడు వర్మ స్థాయిని చూడకుండా ఆయన్ని నమ్మి ఎలా సినిమా చేస్తాడో ఏమో?
This post was last modified on June 6, 2021 10:13 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…