రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టుల్లో చాలామంది ఒకప్పుడు తహతహలాడేవాళ్లు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్లు. శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి చిత్రాలతో అన్ని ఇండస్ట్రీల టాప్ స్టార్స్కు తనతో సినిమా చేయాలన్న కోరిక పుట్టించిన ఘనత వర్మ సొంతం. తెలుగులో చిరంజీవి సైతం వర్మతో ఓ సినిమా మొదలుపెట్టగా.. వర్మే దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఇక హిందీలో ఆమిర్ ఖాన్.. వర్మతో అతడి కెరీర్ ఆరంభంలోనే రంగీలా చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లలో వర్మను ఎక్కువగా నమ్మిందంటే అమితాబ్ బచ్చనే. వీరి కలయికలో అరడజనుకు పైగా సినిమాలు రావడం విశేషం. ఐతే అందులో సర్కార్ మాత్రమే పెద్ద విజయం సాధించింది.
సర్కార్ రాజ్, నిశ్శబ్ద్, రణ్, డిపార్ట్మెంట్, సర్కార్-3 సినిమాలు నిరాశ పరిచాయి. ఇందులో డిపార్ట్మెంట్, సర్కార్-3 చిత్రాలైతే పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఐతే వర్మ మీద ఎంతో గురి ఉన్న అమితాబ్.. ఫలితాలతో సంబంధం లేకుండా అతడితో పని చేస్తూనే వచ్చాడు. కానీ వర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలోనూ సర్కార్-3 చేసి తల బొప్పి కట్టించుకున్న అమితాబ్.. ఇక మళ్లీ ఈ దర్శకుడితో పని చేయడనే అంతా అనుకున్నారు. కానీ వర్మ మళ్లీ బిగ్-బిని ఇంప్రెస్ చేసి ఓ సినిమా చేయడానికి ఆయన నుంచి కమిట్మెట్ తీసుకున్నాడని బాలీవుడ్ మీడియా తాజాగా రిపోర్ట్ చేస్తోంది.
లాక్ డౌన్ టైంలో క్లైమాక్స్ అని, థ్రిల్లర్ అని నాసిరకం సినిమాలు తీసిన వర్మను ఇంకా అమితాబ్ నమ్మి సినిమా చేస్తున్నాడంటే షాకవ్వాల్సిందే. తన దగ్గరికి ఎంతోమంది ప్రతిభావంతులైన ఫిలిం మేకర్స్ నరేషన్ కోసం వస్తున్నారని.. అవన్నీ వినే సమయం కూడా ఉండట్లేదని.. చాలా ప్రత్యేకమైన పాత్రలు, సినిమాలనే ఎంచుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బిగ్-బి.. ఇప్పుడు వర్మ స్థాయిని చూడకుండా ఆయన్ని నమ్మి ఎలా సినిమా చేస్తాడో ఏమో?
This post was last modified on June 6, 2021 10:13 am
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…