రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టుల్లో చాలామంది ఒకప్పుడు తహతహలాడేవాళ్లు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్లు. శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి చిత్రాలతో అన్ని ఇండస్ట్రీల టాప్ స్టార్స్కు తనతో సినిమా చేయాలన్న కోరిక పుట్టించిన ఘనత వర్మ సొంతం. తెలుగులో చిరంజీవి సైతం వర్మతో ఓ సినిమా మొదలుపెట్టగా.. వర్మే దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఇక హిందీలో ఆమిర్ ఖాన్.. వర్మతో అతడి కెరీర్ ఆరంభంలోనే రంగీలా చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లలో వర్మను ఎక్కువగా నమ్మిందంటే అమితాబ్ బచ్చనే. వీరి కలయికలో అరడజనుకు పైగా సినిమాలు రావడం విశేషం. ఐతే అందులో సర్కార్ మాత్రమే పెద్ద విజయం సాధించింది.
సర్కార్ రాజ్, నిశ్శబ్ద్, రణ్, డిపార్ట్మెంట్, సర్కార్-3 సినిమాలు నిరాశ పరిచాయి. ఇందులో డిపార్ట్మెంట్, సర్కార్-3 చిత్రాలైతే పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఐతే వర్మ మీద ఎంతో గురి ఉన్న అమితాబ్.. ఫలితాలతో సంబంధం లేకుండా అతడితో పని చేస్తూనే వచ్చాడు. కానీ వర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలోనూ సర్కార్-3 చేసి తల బొప్పి కట్టించుకున్న అమితాబ్.. ఇక మళ్లీ ఈ దర్శకుడితో పని చేయడనే అంతా అనుకున్నారు. కానీ వర్మ మళ్లీ బిగ్-బిని ఇంప్రెస్ చేసి ఓ సినిమా చేయడానికి ఆయన నుంచి కమిట్మెట్ తీసుకున్నాడని బాలీవుడ్ మీడియా తాజాగా రిపోర్ట్ చేస్తోంది.
లాక్ డౌన్ టైంలో క్లైమాక్స్ అని, థ్రిల్లర్ అని నాసిరకం సినిమాలు తీసిన వర్మను ఇంకా అమితాబ్ నమ్మి సినిమా చేస్తున్నాడంటే షాకవ్వాల్సిందే. తన దగ్గరికి ఎంతోమంది ప్రతిభావంతులైన ఫిలిం మేకర్స్ నరేషన్ కోసం వస్తున్నారని.. అవన్నీ వినే సమయం కూడా ఉండట్లేదని.. చాలా ప్రత్యేకమైన పాత్రలు, సినిమాలనే ఎంచుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బిగ్-బి.. ఇప్పుడు వర్మ స్థాయిని చూడకుండా ఆయన్ని నమ్మి ఎలా సినిమా చేస్తాడో ఏమో?
This post was last modified on June 6, 2021 10:13 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…