ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమాను ప్రకటించారు. ఎన్టీఆర్ 30గా అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాకు దర్శకుడు కాకుండా ఖరారైంది నిర్మాతలు మాత్రమే. కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.
సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో, దర్శకుడు కాకుండా వీరి పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొరటాల తొలి నాలుగు చిత్రాలకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్.. అలాగే ప్రస్తుతం భీకర ఫాంలో ఉన్న తమన్.. మరోవైపు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రేసులో నిలిచారు.
ఐతే అనిరుధ్నే ఎన్టీఆర్ 30కి రేసులో ముందున్నట్లు ఇంతకుముందే వార్తలు రాగా.. ఇప్పుడు అదే విషయం కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందట. ఇప్పుడు ప్రత్యేక సందర్భం అంటూ ఏమీ లేకపోయినా.. అభిమానులను ఎంగేజ్ చేయడానికి ప్రకటన ఇవ్వబోతున్నారట. దీని గురించి ట్విట్టర్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ 30 అనే హ్యాష్ ట్యాగ్ సైతం ట్రెండ్ అవుతుండటం విశేషం. దేవిశ్రీ, తమన్, అనిరుధ్ల్లో ఎవరు ఈ సినిమాకు పని చేస్తే బాగుంటుందని పోల్ పెడితే.. ఎక్కువమంది అభిమానులు అనిరుధ్కే ఓటేస్తుండటం విశేషం. ఇంతకుముందు అరవింద సమేతకు సంగీత దర్శకుడిగా ఖరారైనట్లే అయి అనూహ్యంగా ఆ సినిమాకు అనిరుధ్ దూరం కావాల్సి వచ్చింది. మరి ఈసారి తారక్తో పని చేసే అవకాశం లభిస్తున్న నేపథ్యంలో అతనెలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on June 6, 2021 7:45 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…