‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. గతేడాది ‘హిట్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టినట్లు సమాచారం. టాలీవుడ్ లో ఉన్న యంగ్ రైటర్లలో ప్రసన్న ఒకరు. రీసెంట్ గా ఇతడు విశ్వక్ సేన్ కోసం కథ సిద్ధం చేసినట్లు సమాచారం.
యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథలను రాయడంతో ప్రసన్నకు మంచి పేరుంది. దర్శకుడు త్రినాథరావు నక్కినతో కలిసి పని చేస్తుంటారు ప్రసన్న. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘హలో గురు ప్రేమకోసమే’,’నేను లోకల్’ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రవితేజ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. అలానే ప్రసన్న సెపరేట్ గా ఓ కథను రెడీ చేసుకొని విశ్వక్ సేన్ కు వినిపించారట.
కథలో కొత్తదనం, యూత్ కి నచ్చే పాయింట్స్ ఉండడంతో విశ్వక్ సేన్ వెంటనే ఓకే చెప్పేశారట. కానీ ఈ సినిమాకి దర్శకుడు త్రినాథరావు కాదట. వేరే డైరెక్టర్ సూర్య ప్రతాప్ చేతుల్లో ఈ కథ పెట్టబోతున్నారని సమాచారం. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన ఈ దర్శకుడు గతంలో ‘కుమారి 21 ఎఫ్’ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కొన్నిరోజుల్లో విదులయ్యే ఛాన్స్ ఉంది. సూర్య ప్రతాప్ తదుపరి చిత్రంగా విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. రైటర్ ప్రసన్న స్వయంగా సూర్య ప్రతాప్ పేరుని సూచించినట్లు సమాచారం.
This post was last modified on June 6, 2021 7:40 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…