‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. గతేడాది ‘హిట్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టినట్లు సమాచారం. టాలీవుడ్ లో ఉన్న యంగ్ రైటర్లలో ప్రసన్న ఒకరు. రీసెంట్ గా ఇతడు విశ్వక్ సేన్ కోసం కథ సిద్ధం చేసినట్లు సమాచారం.
యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథలను రాయడంతో ప్రసన్నకు మంచి పేరుంది. దర్శకుడు త్రినాథరావు నక్కినతో కలిసి పని చేస్తుంటారు ప్రసన్న. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘హలో గురు ప్రేమకోసమే’,’నేను లోకల్’ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రవితేజ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. అలానే ప్రసన్న సెపరేట్ గా ఓ కథను రెడీ చేసుకొని విశ్వక్ సేన్ కు వినిపించారట.
కథలో కొత్తదనం, యూత్ కి నచ్చే పాయింట్స్ ఉండడంతో విశ్వక్ సేన్ వెంటనే ఓకే చెప్పేశారట. కానీ ఈ సినిమాకి దర్శకుడు త్రినాథరావు కాదట. వేరే డైరెక్టర్ సూర్య ప్రతాప్ చేతుల్లో ఈ కథ పెట్టబోతున్నారని సమాచారం. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన ఈ దర్శకుడు గతంలో ‘కుమారి 21 ఎఫ్’ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కొన్నిరోజుల్లో విదులయ్యే ఛాన్స్ ఉంది. సూర్య ప్రతాప్ తదుపరి చిత్రంగా విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. రైటర్ ప్రసన్న స్వయంగా సూర్య ప్రతాప్ పేరుని సూచించినట్లు సమాచారం.
This post was last modified on June 6, 2021 7:40 am
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…