మీ డ్రీమ్ రోల్ ఏంటి.. ఫలానా పాత్ర నేను చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా.. ఏదైనా సినిమాలో ఛాన్స్ మిస్సయిందని ఫీలయ్యారా.. హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు వాళ్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. ముఖ్యంగా హీరోయిన్లకైతే ఈ క్వశ్చన్లు కామన్. కొందరు హీరోయిన్ల దగ్గర ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉంటాయి. కొందరు ఏం చెప్పాలో తెలియని అయోమయానికి గురవుతారు.
ఇంకొందరు మాత్రం ఈ ప్రశ్నలకు ‘నో’ అనే సమాధానమే చెబుతారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా మంచి పేరు సంపాదించిన అంజలి ఈ కోవకే చెందుతుంది. ముందు తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళంలో మంచి స్థాయిని అందుకుని.. ఆపై తెలుగులోకీ రీఎంట్రీ ఇచ్చి ఇక్కడా సత్తా చాటిన అంజలికి కొన్నేళ్లుగా ఏమంత కలిసి రావడం లేదు. అవకాశాలు తగ్గాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మీకు ఆఫర్లు తగ్గాయేంటి.. ఏవైనా పాత్రలు మిస్సయ్యానని ఫీలయ్యారా అని అడిగితే.. తనదైన శైలిలో బదులిచ్చింది. వేరే హీరోయిన్ల వల్ల తనకు వచ్చే ఆఫర్లు ఎప్పుడూ తగ్గలేదని అన్న అంజలి.. కొత్త వారు వచ్చినంత మాత్రాన పాత వారికి ఆఫర్లు తగ్గుతాయని తాను అనుకోవడం లేదని అంది. ఒక పాత్రకు ఎవరు అయితే సూటవుతారో వాళ్లనే దర్శకులు ఎంచుకుంటారని.. అంతే తప్ప ఒకరి అవకాశాన్ని మరొకరు లాక్కునే పరిస్థితి ఉండదని అంజలి పేర్కొంది.
వేరే వాళ్లు చేసిన పాత్రలను తాను చేయాలని కోరుకోనని ఆమె చెప్పింది. ఫలానా పాత్రను నేను చేస్తే బాగుండేది అని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇంకెప్పుడూ అనుకోను కూడా అని ఈ తెలుగమ్మాయి స్పష్టం చేసింది. తన దగ్గరికి వచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని.. రాని ఆఫర్ల గురించి ఎప్పుడూ బాధ పడనని అంజలి అంది. చివరగా తెలుగులో అంజలి ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 5, 2021 3:51 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…