మీ డ్రీమ్ రోల్ ఏంటి.. ఫలానా పాత్ర నేను చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా.. ఏదైనా సినిమాలో ఛాన్స్ మిస్సయిందని ఫీలయ్యారా.. హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు వాళ్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. ముఖ్యంగా హీరోయిన్లకైతే ఈ క్వశ్చన్లు కామన్. కొందరు హీరోయిన్ల దగ్గర ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉంటాయి. కొందరు ఏం చెప్పాలో తెలియని అయోమయానికి గురవుతారు.
ఇంకొందరు మాత్రం ఈ ప్రశ్నలకు ‘నో’ అనే సమాధానమే చెబుతారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా మంచి పేరు సంపాదించిన అంజలి ఈ కోవకే చెందుతుంది. ముందు తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళంలో మంచి స్థాయిని అందుకుని.. ఆపై తెలుగులోకీ రీఎంట్రీ ఇచ్చి ఇక్కడా సత్తా చాటిన అంజలికి కొన్నేళ్లుగా ఏమంత కలిసి రావడం లేదు. అవకాశాలు తగ్గాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మీకు ఆఫర్లు తగ్గాయేంటి.. ఏవైనా పాత్రలు మిస్సయ్యానని ఫీలయ్యారా అని అడిగితే.. తనదైన శైలిలో బదులిచ్చింది. వేరే హీరోయిన్ల వల్ల తనకు వచ్చే ఆఫర్లు ఎప్పుడూ తగ్గలేదని అన్న అంజలి.. కొత్త వారు వచ్చినంత మాత్రాన పాత వారికి ఆఫర్లు తగ్గుతాయని తాను అనుకోవడం లేదని అంది. ఒక పాత్రకు ఎవరు అయితే సూటవుతారో వాళ్లనే దర్శకులు ఎంచుకుంటారని.. అంతే తప్ప ఒకరి అవకాశాన్ని మరొకరు లాక్కునే పరిస్థితి ఉండదని అంజలి పేర్కొంది.
వేరే వాళ్లు చేసిన పాత్రలను తాను చేయాలని కోరుకోనని ఆమె చెప్పింది. ఫలానా పాత్రను నేను చేస్తే బాగుండేది అని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇంకెప్పుడూ అనుకోను కూడా అని ఈ తెలుగమ్మాయి స్పష్టం చేసింది. తన దగ్గరికి వచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని.. రాని ఆఫర్ల గురించి ఎప్పుడూ బాధ పడనని అంజలి అంది. చివరగా తెలుగులో అంజలి ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 5, 2021 3:51 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…