ఏటా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుసగా రెండో ఏడాది కూడా విజయ్ దేవరకొండ అగ్ర స్థానం సాధించిన సంగతి తెలిసిందే. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించినప్పటి నుంచి ఈ జాబితాలో విజయ్ హైలైట్ అవుతూనే ఉన్నాడు.
టాలీవుడ్లో ఎంతోమంది బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ.. వాళ్లను వెనక్కి నెట్టి విజయ్ వరుసగా రెండేళ్లు అగ్ర స్థానంలో నిలవడం విశేషమే. ఐతే అతడి పాపులారిటీ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాదు. ఇండియా వైడ్ అతడికి ఫాలోయింగ్ ఉంది. అది ఇప్పుడు జాతీయ స్థౄయిలో టైమ్స్ గ్రూప్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలోనూ కనిపించింది. ఈ లిస్టులో విజయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.
బాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టి నేషనల్ లెవెల్లో రెండో స్థానం సాధిండమంటే మాటలు కాదు. ఈ జాబితాలో అగ్ర స్థానం సాధించింది దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కావడం విశేషం. గత ఏడాది సుశాంత్ చనిపోయినప్పటి నుంచి అతడిపై ప్రేక్షకుల్లో అమితమైన ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. చనిపోయాక అతడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. అతడిలో జనాలకు తెలియని మంచి లక్షణాల గురించి ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరణానంతరం అతను మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అతను అగ్ర స్థానంలో నిలవడం తన పాపులారిటీకి నిదర్శనం.
ఇక ఈ జాబితాలో ఆదిత్య రాయ్ కపూర్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. దుల్కర్ కేరళ వరకు ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. తమిళనాడు పరిధిలో రెండో స్థానం సాధించడం విశేషం. ఇక నేషనల్ లిస్టులో టైగర్ ష్రాఫ్, విరాట్ కోహ్లి, రణ్వీర్ సింగ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు.
This post was last modified on June 4, 2021 10:29 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…