ఏటా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుసగా రెండో ఏడాది కూడా విజయ్ దేవరకొండ అగ్ర స్థానం సాధించిన సంగతి తెలిసిందే. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించినప్పటి నుంచి ఈ జాబితాలో విజయ్ హైలైట్ అవుతూనే ఉన్నాడు.
టాలీవుడ్లో ఎంతోమంది బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ.. వాళ్లను వెనక్కి నెట్టి విజయ్ వరుసగా రెండేళ్లు అగ్ర స్థానంలో నిలవడం విశేషమే. ఐతే అతడి పాపులారిటీ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాదు. ఇండియా వైడ్ అతడికి ఫాలోయింగ్ ఉంది. అది ఇప్పుడు జాతీయ స్థౄయిలో టైమ్స్ గ్రూప్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలోనూ కనిపించింది. ఈ లిస్టులో విజయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.
బాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టి నేషనల్ లెవెల్లో రెండో స్థానం సాధిండమంటే మాటలు కాదు. ఈ జాబితాలో అగ్ర స్థానం సాధించింది దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కావడం విశేషం. గత ఏడాది సుశాంత్ చనిపోయినప్పటి నుంచి అతడిపై ప్రేక్షకుల్లో అమితమైన ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. చనిపోయాక అతడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. అతడిలో జనాలకు తెలియని మంచి లక్షణాల గురించి ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరణానంతరం అతను మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అతను అగ్ర స్థానంలో నిలవడం తన పాపులారిటీకి నిదర్శనం.
ఇక ఈ జాబితాలో ఆదిత్య రాయ్ కపూర్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. దుల్కర్ కేరళ వరకు ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. తమిళనాడు పరిధిలో రెండో స్థానం సాధించడం విశేషం. ఇక నేషనల్ లిస్టులో టైగర్ ష్రాఫ్, విరాట్ కోహ్లి, రణ్వీర్ సింగ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…