ఏటా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుసగా రెండో ఏడాది కూడా విజయ్ దేవరకొండ అగ్ర స్థానం సాధించిన సంగతి తెలిసిందే. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించినప్పటి నుంచి ఈ జాబితాలో విజయ్ హైలైట్ అవుతూనే ఉన్నాడు.
టాలీవుడ్లో ఎంతోమంది బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ.. వాళ్లను వెనక్కి నెట్టి విజయ్ వరుసగా రెండేళ్లు అగ్ర స్థానంలో నిలవడం విశేషమే. ఐతే అతడి పాపులారిటీ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాదు. ఇండియా వైడ్ అతడికి ఫాలోయింగ్ ఉంది. అది ఇప్పుడు జాతీయ స్థౄయిలో టైమ్స్ గ్రూప్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలోనూ కనిపించింది. ఈ లిస్టులో విజయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.
బాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టి నేషనల్ లెవెల్లో రెండో స్థానం సాధిండమంటే మాటలు కాదు. ఈ జాబితాలో అగ్ర స్థానం సాధించింది దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కావడం విశేషం. గత ఏడాది సుశాంత్ చనిపోయినప్పటి నుంచి అతడిపై ప్రేక్షకుల్లో అమితమైన ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. చనిపోయాక అతడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. అతడిలో జనాలకు తెలియని మంచి లక్షణాల గురించి ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరణానంతరం అతను మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అతను అగ్ర స్థానంలో నిలవడం తన పాపులారిటీకి నిదర్శనం.
ఇక ఈ జాబితాలో ఆదిత్య రాయ్ కపూర్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. దుల్కర్ కేరళ వరకు ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. తమిళనాడు పరిధిలో రెండో స్థానం సాధించడం విశేషం. ఇక నేషనల్ లిస్టులో టైగర్ ష్రాఫ్, విరాట్ కోహ్లి, రణ్వీర్ సింగ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు.
This post was last modified on June 4, 2021 10:29 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…