రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసేసుకొని వార్తల్లో నిలిచింది. ఆమె మరెవరో కాదు.. యామీ గౌతమ్. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ యాడ్ తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఆ తరువాత తెలుగులో ‘నువ్విలా’,’గౌరవం’ లాంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో కనిపించింది. ప్రస్తుతం నటిగా కొన్ని సినిమాలు చేస్తోన్న ఈమె రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లాడింది. కోవిడ్ నిబంధనల కారణంగా అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. శుక్రవారం నాడు వీరి వివాహం జరగగా.. ఈ విషయాన్ని యామీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
యామీ పెళ్లి చేసుకున్న దర్శకుడు ఆదిత్య ‘ఉరి’ సినిమాతో బాలీవుడ్ లో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగునాట కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో యామీ గౌతమ్ కూడా కీలకపాత్ర పోషించింది. అప్పటినుండే వీరి స్నేహం మరింత బలపడి పెళ్లి వరకు వచ్చిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య.. విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
This post was last modified on June 4, 2021 7:28 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…