రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసేసుకొని వార్తల్లో నిలిచింది. ఆమె మరెవరో కాదు.. యామీ గౌతమ్. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ యాడ్ తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఆ తరువాత తెలుగులో ‘నువ్విలా’,’గౌరవం’ లాంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో కనిపించింది. ప్రస్తుతం నటిగా కొన్ని సినిమాలు చేస్తోన్న ఈమె రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లాడింది. కోవిడ్ నిబంధనల కారణంగా అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. శుక్రవారం నాడు వీరి వివాహం జరగగా.. ఈ విషయాన్ని యామీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
యామీ పెళ్లి చేసుకున్న దర్శకుడు ఆదిత్య ‘ఉరి’ సినిమాతో బాలీవుడ్ లో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగునాట కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో యామీ గౌతమ్ కూడా కీలకపాత్ర పోషించింది. అప్పటినుండే వీరి స్నేహం మరింత బలపడి పెళ్లి వరకు వచ్చిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య.. విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
This post was last modified on June 4, 2021 7:28 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…