Movie News

డీవీవీ దానయ్యతో ప్రశాంత్ నీల్..?

‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యష్ కు స్టార్ స్టేటస్ లభించింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘కేజీఎఫ్ 2’ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఓ తెలుగు సినిమాను డైరెక్ట్ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమాను ఖరారు చేసుకున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. దీని తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాల్సివుంది. ఆ తరువాతే ప్రశాంత్ నీల్ కి డేట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య.. ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వాటికి మరింత బలం చేకూరేలా ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

దీంతో ఈ సంస్థ నుండి ప్రశాంత్ నీల్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ అందిన మాట నిజమేనని అంటున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సైతం ‘మీ కాంబోలో సినిమా ఎప్పుడు..? హీరోని ఫైనల్ చేశారా..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొదటి నుండి కూడా దానయ్య ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లకు అడ్వాన్స్ లు ఇస్తూ ముందుగానే వాళ్లను లాక్ చేస్తుంటారు. రాజమౌళి విషయంలో కూడా ఇలానే చేశారు. చాలా ఏళ్ల క్రితం రాజమౌళి కి అడ్వాన్స్ ఇవ్వగా.. ఇప్పటికి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. ప్రశాంత్ నీల్ కు కూడా అలానే అడ్వాన్స్ ఇచ్చి భవిష్యత్తులో సినిమా చేసే విధంగా హామీ తీసుకున్నట్లు సమాచారం.

This post was last modified on June 4, 2021 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

20 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

43 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago