టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏటా ‘మోస్ట్ డిజైరబుల్’ మెన్ అండ్ వుమెన్ లిస్టు ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, ఇలా వేర్వేరు భాషలు, ప్రాంతాలకు ఈ లిస్ట్ ఇస్తుంటారు. తెలుగు ప్రాంతం విషయానికి వస్తే హైదరాబాద్ బేస్డ్గా ఈ జాబితాను ఇస్తుంటారు. ఈ లిస్ట్ ఇచ్చినపుడు సామాజిక మాధ్యమాల్లో బాగానే చర్చ జరుగుతుంటుంది. ఈ టాపిక్ ట్రెండింగ్లో ఉంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ లాగే ఈ సారి కూడా ఈ జాబితాలో కొన్ని సిత్రాలు చోటు చేసుకున్నాయి.
ఈసారి ఈ జాబితాలో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్లు కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఐతే వీళ్లిద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిసారీ టాప్ ప్లేసుకు పోటీలో ఉంటారు కాబట్టి.. ఈ ఇద్దరినీ వార్షిక పోటీకి పరిగణించకుండా ‘ఫరెవర్ డిజైరబుల్’ లిస్టులో పెట్టేశారట. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముందు నుంచి ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది మహేష్ బాబును ఇందులోకి చేర్చగా.. ఈసారి ప్రభాస్ అందులోకి వెళ్లాడు.
ఇక వార్షిక జాబితాను పరిశీలిస్తే.. విజయ్ దేవరకొండ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ.. ఈ జాబితాలోకి అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ రావడమే చాలామందికి అర్థం కావడం లేదు. పైగా అతను 21వ స్థానంలో ఉంటే.. అడివి శేష్ (22), నితిన్ (25) నాని (26) తనకంటే దిగువన ఉన్నారు. ఆనంద్లో పోలిక పక్కన పెడితే.. శేష్, నితిన్, నాని ఇంత దిగువన ఉండటం సమంజసంగా అనిపించడం లేదు. అల్లు అర్జున్ కూడా 17వ స్థానానికి పరిమితం కావడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. రామ్, నాగశౌర్య, సందీప్ కిషన్లను వరుసగా 2, 5, 9 స్థానాల్లో పెట్టి.. పైన చెప్పుకున్న హీరోలను కింద పడేయడం వారి అభిమానులకు నచ్చట్లేదు.
This post was last modified on June 3, 2021 10:40 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…