Movie News

నితిన్ వదిలేశాడు.. అతడి పరిస్థితేంటో?

యువ కథానాయకుడు నితిన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యధిక బడ్జెట్లో ఓ సినిమా చేయడానికి కొన్నేళ్ల నుంచి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమానే.. పవర్ పేట. ‘రౌడీ ఫెలో’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నితిన్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ తీసిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య ఈ చిత్రాన్ని రూపొందించాల్సింది. ‘ఛల్ మోహన్ రంగ’ విడుదలై మూడేళ్లు దాటిపోగా.. ఆ చిత్రం రిలీజైన కొన్ని నెలల నుంచే కృష్ణచైతన్య ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు.

తమిళంలో ‘వడ చెన్నై’ తరహాలో ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి పెట్టింది పేరైన ఓ ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి కృష్ణచైతన్య చాలానే కసరత్తు చేశాడు. పవర్ పేట చరిత్ర, నేపథ్యం మీద ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేశాడు. భారీ బడ్జెట్ అయ్యే ఈ చిత్రానికి వేరే నిర్మాతల కోసం చూడకుండా నితినే డబ్బులు పెట్టడానికి కూడా రెడీ అయ్యాడు. ఐతే కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టు మీద కలిసి పని చేశాక.. చివరికి ఇప్పుడు కృష్ణచైతన్యకు హ్యాండ్ ఇచ్చేశాడు నితిన్.

చెక్, రంగ్ దె ఆశించిన ఫలితాలనివ్వకపోవడం నితిన్ ఆలోచనను మార్చినట్లుంది. ప్రస్తుతం తన మార్కెట్ అంత బాగా లేదు, పైగా కరోనా కారణంగా ఫైనాన్స్ సమస్యలూ తలెత్తుతున్నాయి. పైగా ‘పవర్ పేట’ రాజకీయాలతో ముడిపడ్డ కథాంశం. కాబట్టి ఇప్పుడీ సినిమా చేయడం మంచిది కాదని భావించి నితిన్ వెనక్కి తగ్గినట్లున్నాడు. దీని బదులు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారన్న సమాచారం నేపథ్యంలో ‘పవర్ పేట’ పక్కకు వెళ్లినట్లే. భవిష్యత్తులో అయినా నితిన్ ఈ సినిమా చేస్తాడా అన్నది సందేహమే. మరి ఈ స్క్రిప్టు మీద దాదాపు మూడేళ్లు పని చేసిన కృష్ణచైతన్య పరిస్థితేంటన్నది ప్రశ్న. ఈ కథను ఇంకో హీరో చేయడం కూడా డౌటే. కాబట్టి ఇక వేరే స్క్రిప్టు మీద పడాలి. ఇంకో హీరోను వెతుక్కోవాలి. మరో మార్గం లేదు.

This post was last modified on June 3, 2021 9:14 am

Share

Recent Posts

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

1 hour ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

4 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

8 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

12 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

13 hours ago