యువ కథానాయకుడు నితిన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యధిక బడ్జెట్లో ఓ సినిమా చేయడానికి కొన్నేళ్ల నుంచి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమానే.. పవర్ పేట. ‘రౌడీ ఫెలో’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నితిన్తో ‘ఛల్ మోహన్ రంగ’ తీసిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య ఈ చిత్రాన్ని రూపొందించాల్సింది. ‘ఛల్ మోహన్ రంగ’ విడుదలై మూడేళ్లు దాటిపోగా.. ఆ చిత్రం రిలీజైన కొన్ని నెలల నుంచే కృష్ణచైతన్య ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు.
తమిళంలో ‘వడ చెన్నై’ తరహాలో ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి పెట్టింది పేరైన ఓ ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి కృష్ణచైతన్య చాలానే కసరత్తు చేశాడు. పవర్ పేట చరిత్ర, నేపథ్యం మీద ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేశాడు. భారీ బడ్జెట్ అయ్యే ఈ చిత్రానికి వేరే నిర్మాతల కోసం చూడకుండా నితినే డబ్బులు పెట్టడానికి కూడా రెడీ అయ్యాడు. ఐతే కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టు మీద కలిసి పని చేశాక.. చివరికి ఇప్పుడు కృష్ణచైతన్యకు హ్యాండ్ ఇచ్చేశాడు నితిన్.
చెక్, రంగ్ దె ఆశించిన ఫలితాలనివ్వకపోవడం నితిన్ ఆలోచనను మార్చినట్లుంది. ప్రస్తుతం తన మార్కెట్ అంత బాగా లేదు, పైగా కరోనా కారణంగా ఫైనాన్స్ సమస్యలూ తలెత్తుతున్నాయి. పైగా ‘పవర్ పేట’ రాజకీయాలతో ముడిపడ్డ కథాంశం. కాబట్టి ఇప్పుడీ సినిమా చేయడం మంచిది కాదని భావించి నితిన్ వెనక్కి తగ్గినట్లున్నాడు. దీని బదులు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారన్న సమాచారం నేపథ్యంలో ‘పవర్ పేట’ పక్కకు వెళ్లినట్లే. భవిష్యత్తులో అయినా నితిన్ ఈ సినిమా చేస్తాడా అన్నది సందేహమే. మరి ఈ స్క్రిప్టు మీద దాదాపు మూడేళ్లు పని చేసిన కృష్ణచైతన్య పరిస్థితేంటన్నది ప్రశ్న. ఈ కథను ఇంకో హీరో చేయడం కూడా డౌటే. కాబట్టి ఇక వేరే స్క్రిప్టు మీద పడాలి. ఇంకో హీరోను వెతుక్కోవాలి. మరో మార్గం లేదు.
This post was last modified on June 3, 2021 9:14 am
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…