తెలుగుదేశం నేత మాజి ఎంపి మాగంటి బాబుకు ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఆయన రెండో కుమారుడు రవీంద్రనాథ్ తాజాగా మరణించారు. కొన్ని వారాల క్రితమే ఆయన పెద్దకుమారుడు రాంజీ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ శోకం నుంచి మాగంటి కుటుంబం కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో ఆయన రెండో కుమారుడు కూడా మరణించడం సంచలనం అవుతోంది.
మరణానికి కారణాలు ఏంటో తెలియడం లేదు. ఒక వర్గం ఏమో ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు అని చెబుతోంది. మరోవైపు నుంచి ఆయన ఒక స్టార్ హోటల్లో మరణించారు అని సమాచారం తెలుస్తోంది. కుటుంబం గాని, పోలీసులు గాని ఇంకా దీనిపై మాట్లాడినట్లు వీడియోలేమీ బయటకు రాలేదు.
రెండో కొడుకు రవీంద్రనాధ్ కొద్దిరోజులుగా స్టార్ హోటల్లో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా కొన్ని వారాల వ్యవధిలో ఒక ప్రముఖ నేత తన ఇద్దరు సంతానాన్ని కోల్పోవడం ఇటీవల కాలంలో ఎన్నడూ ఎవరింట జరగలేదు. ప్రత్యర్థులు కూడా జాలి చూపేటంత విషాదమిది. వారసులు ఇద్దరు కోల్పోయిన ఆ కుటుంబానికి ఇక ఓదార్పేదీ!
This post was last modified on June 2, 2021 6:05 am
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…