తెలుగుదేశం నేత మాజి ఎంపి మాగంటి బాబుకు ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఆయన రెండో కుమారుడు రవీంద్రనాథ్ తాజాగా మరణించారు. కొన్ని వారాల క్రితమే ఆయన పెద్దకుమారుడు రాంజీ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ శోకం నుంచి మాగంటి కుటుంబం కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో ఆయన రెండో కుమారుడు కూడా మరణించడం సంచలనం అవుతోంది.
మరణానికి కారణాలు ఏంటో తెలియడం లేదు. ఒక వర్గం ఏమో ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు అని చెబుతోంది. మరోవైపు నుంచి ఆయన ఒక స్టార్ హోటల్లో మరణించారు అని సమాచారం తెలుస్తోంది. కుటుంబం గాని, పోలీసులు గాని ఇంకా దీనిపై మాట్లాడినట్లు వీడియోలేమీ బయటకు రాలేదు.
రెండో కొడుకు రవీంద్రనాధ్ కొద్దిరోజులుగా స్టార్ హోటల్లో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా కొన్ని వారాల వ్యవధిలో ఒక ప్రముఖ నేత తన ఇద్దరు సంతానాన్ని కోల్పోవడం ఇటీవల కాలంలో ఎన్నడూ ఎవరింట జరగలేదు. ప్రత్యర్థులు కూడా జాలి చూపేటంత విషాదమిది. వారసులు ఇద్దరు కోల్పోయిన ఆ కుటుంబానికి ఇక ఓదార్పేదీ!
This post was last modified on June 2, 2021 6:05 am
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…