తెలుగుదేశం నేత మాజి ఎంపి మాగంటి బాబుకు ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఆయన రెండో కుమారుడు రవీంద్రనాథ్ తాజాగా మరణించారు. కొన్ని వారాల క్రితమే ఆయన పెద్దకుమారుడు రాంజీ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ శోకం నుంచి మాగంటి కుటుంబం కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో ఆయన రెండో కుమారుడు కూడా మరణించడం సంచలనం అవుతోంది.
మరణానికి కారణాలు ఏంటో తెలియడం లేదు. ఒక వర్గం ఏమో ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు అని చెబుతోంది. మరోవైపు నుంచి ఆయన ఒక స్టార్ హోటల్లో మరణించారు అని సమాచారం తెలుస్తోంది. కుటుంబం గాని, పోలీసులు గాని ఇంకా దీనిపై మాట్లాడినట్లు వీడియోలేమీ బయటకు రాలేదు.
రెండో కొడుకు రవీంద్రనాధ్ కొద్దిరోజులుగా స్టార్ హోటల్లో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా కొన్ని వారాల వ్యవధిలో ఒక ప్రముఖ నేత తన ఇద్దరు సంతానాన్ని కోల్పోవడం ఇటీవల కాలంలో ఎన్నడూ ఎవరింట జరగలేదు. ప్రత్యర్థులు కూడా జాలి చూపేటంత విషాదమిది. వారసులు ఇద్దరు కోల్పోయిన ఆ కుటుంబానికి ఇక ఓదార్పేదీ!
This post was last modified on June 2, 2021 6:05 am
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…