టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటినుండి కూడా యూత్ ఫుల్ కథలను ఎన్నుకుంటూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె చివరిగా తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. సమంత నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు నందినిరెడ్డి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. నాగశౌర్యతో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అలానే మరో ఇద్దరు, ముగ్గురు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా నందినిరెడ్డి టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యంగ్ హీరోలు నాగచైతన్య, సంతోష్ శోభన్ లతో నందిని సినిమాలు చేయబోతున్నారు. నిజానికి ముందుగా నాగచైతన్యతో సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వలన కుర్ర హీరో సంతోష్ శోభన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నందిని రెడ్డి. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తరువాత సంతోష్ శోభన్ కి సరైన హిట్టు పడలేదు.
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ ఓకే అనిపించింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. దీంతో సంతోష్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించబోతున్న సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు నందిని రెడ్డి.. గీతాఆర్ట్స్ లో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోపక్క ‘ఆహా’ యాప్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు.
This post was last modified on June 2, 2021 6:07 am
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…
మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల…
రాకా సినిమా కోసం అల్లు అర్జున్ కేవలం హైదరాబాద్ లో ఉంటే సరిపోవట్లేదు. షూటింగ్, ఇతరత్రా కార్యక్రమాల కోసం పదే…