Movie News

వైజయంతి మూవీస్ తో నందినిరెడ్డి డీల్!

టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటినుండి కూడా యూత్ ఫుల్ కథలను ఎన్నుకుంటూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె చివరిగా తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. సమంత నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు నందినిరెడ్డి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. నాగశౌర్యతో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అలానే మరో ఇద్దరు, ముగ్గురు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా నందినిరెడ్డి టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యంగ్ హీరోలు నాగచైతన్య, సంతోష్ శోభన్ లతో నందిని సినిమాలు చేయబోతున్నారు. నిజానికి ముందుగా నాగచైతన్యతో సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వలన కుర్ర హీరో సంతోష్ శోభన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నందిని రెడ్డి. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తరువాత సంతోష్ శోభన్ కి సరైన హిట్టు పడలేదు.

రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ ఓకే అనిపించింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. దీంతో సంతోష్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించబోతున్న సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు నందిని రెడ్డి.. గీతాఆర్ట్స్ లో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోపక్క ‘ఆహా’ యాప్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు.

This post was last modified on June 2, 2021 6:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

15 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago