Movie News

వైజయంతి మూవీస్ తో నందినిరెడ్డి డీల్!

టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటినుండి కూడా యూత్ ఫుల్ కథలను ఎన్నుకుంటూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె చివరిగా తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. సమంత నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు నందినిరెడ్డి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. నాగశౌర్యతో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అలానే మరో ఇద్దరు, ముగ్గురు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా నందినిరెడ్డి టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యంగ్ హీరోలు నాగచైతన్య, సంతోష్ శోభన్ లతో నందిని సినిమాలు చేయబోతున్నారు. నిజానికి ముందుగా నాగచైతన్యతో సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వలన కుర్ర హీరో సంతోష్ శోభన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నందిని రెడ్డి. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తరువాత సంతోష్ శోభన్ కి సరైన హిట్టు పడలేదు.

రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ ఓకే అనిపించింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. దీంతో సంతోష్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించబోతున్న సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు నందిని రెడ్డి.. గీతాఆర్ట్స్ లో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోపక్క ‘ఆహా’ యాప్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు.

This post was last modified on June 2, 2021 6:07 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

24 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago