‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాపు బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణీత సుభాష్ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బెంగుళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని ప్రణీత ప్రేమ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా ప్రణీత ఇంట్లోనే వివాహం జరిపించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ వివాహం గత ఆదివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం విషయం బయట పడింది. కరోనా కారణంగా ఎవరికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై ప్రణీత స్పందించారు. ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అని స్పష్టం చేశారు. నితిన్ తనకు చాలా కాలంగా తెలుసునని.. తమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత ఇంట్లో విషయం చెప్పామని.. వాళ్లు కూడా తమ నిర్ణయాన్ని గౌరవించారని చెప్పుకొచ్చారు.
తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం ఇష్టం ఉండదని అన్నారు. తన పెళ్లి ఎలా జరగాలని కలలు కన్నానో అలానే జరిగిందని.. కరోనా కారణంగా ఎక్కువ మందిని పిలవలేకపోయానని వివరించారు. ఈ మధ్యనే ప్రణీతకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ‘హంగామా 2’ అలానే ‘భుజ్’ అనే చిత్రాలలో నటిస్తున్నారు. అలానే కన్నడలో ‘రమణ అవతార’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. పెళ్లి తరువాత కూడా నటిగా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తారేమో చూడాలి!
This post was last modified on May 31, 2021 3:00 pm
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు…