గత ఏడాది దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా కలచివేసింది. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాక కూడా చాలా హుషారుగా మాట్లాడి, తాను బాగున్నానని, త్వరలోనే తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత విషమ స్థితిలోకి వెళ్లడం.. చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోవడం.. అభిమానులను విషాదంలోకి నెట్టడం తెలిసిందే. కరోనా నెగెటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోకపోవడం.. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్లతో ప్రాణాలు వదలడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
ఐతే బాలుకు చికిత్స అందించడంలో పొరబాట్లు జరిగాయని.. కొవిడ్ను కట్టడి చేయడంలో స్టెరాయిడ్లను విపరీతంగా వాడటంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయిందని.. అందువల్లే అవయవాలు దెబ్బ తిని ప్రాణాలు కోల్పోయాయని కొందరు వైద్యులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఇదే విషయమై ‘కీటో డైట్’తో పాపులర్ అయిన వీరమాచనేని రామకృష్ణ మాట్లాడారు. బాలు కరోనాతో చనిపోలేదని.. ఆయన్ని వైద్యులు చంపేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదం, ఇతర వైద్యాల విషయంలో సవాలక్ష ప్రశ్నలు వేసే అలోపతి వైద్యులు.. కరోనా చికిత్సలో ఎన్ని తప్పులు చేశారో ప్రపంచం గుర్తించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో బాలు మరణాన్ని ఆయన ఉదహరించారు.
“బాలు గారు ఆసుపత్రికి వెళ్లినపుడు ఎంతో హుషారుగా వెళ్లారు. నీకేం లేదు వెళ్లవయ్యా అని ఉంటే ప్రాణంతో వచ్చేసేవారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన్ని తీసుకెళ్లి ప్రయోగాలు చేసి చంపేశారు. ఆయనకిచ్చిన మందులు ఎవరికిచ్చినా చనిపోతారు. అసలు మనిషి స్టామినా ఎంత? వాళ్లు ఇచ్చే మందుల పవర్ ఎంత? మనిషి తట్టుకోగలడా? ఈ మందుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంట్లో ఎలుకని చంపాలంటే ఇల్లు తగలబెట్టడం లాగే ఉంది. బాలుగారేమైనా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడా? యాక్సిడెంట్లో పచ్చడైపోయి వెళ్లాడా? ఆసుపత్రికి నడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఆయనలా ఇంకెంతోమంది ఉన్నారు. కేవలం ప్రయోగాలు చేసి, అనవసర మందులు వాడి ఆయన్ని చంపేశారు. బాలుగారి చికిత్సలో లోపాలున్నాయని నేను చెప్పడం కాదు. వందల మంది డాక్టర్లు చెప్పారు” అని వీరమాచనేని అన్నారు.
This post was last modified on May 31, 2021 6:50 am
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…