గత ఏడాది దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా కలచివేసింది. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాక కూడా చాలా హుషారుగా మాట్లాడి, తాను బాగున్నానని, త్వరలోనే తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత విషమ స్థితిలోకి వెళ్లడం.. చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోవడం.. అభిమానులను విషాదంలోకి నెట్టడం తెలిసిందే. కరోనా నెగెటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోకపోవడం.. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్లతో ప్రాణాలు వదలడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
ఐతే బాలుకు చికిత్స అందించడంలో పొరబాట్లు జరిగాయని.. కొవిడ్ను కట్టడి చేయడంలో స్టెరాయిడ్లను విపరీతంగా వాడటంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయిందని.. అందువల్లే అవయవాలు దెబ్బ తిని ప్రాణాలు కోల్పోయాయని కొందరు వైద్యులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఇదే విషయమై ‘కీటో డైట్’తో పాపులర్ అయిన వీరమాచనేని రామకృష్ణ మాట్లాడారు. బాలు కరోనాతో చనిపోలేదని.. ఆయన్ని వైద్యులు చంపేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదం, ఇతర వైద్యాల విషయంలో సవాలక్ష ప్రశ్నలు వేసే అలోపతి వైద్యులు.. కరోనా చికిత్సలో ఎన్ని తప్పులు చేశారో ప్రపంచం గుర్తించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో బాలు మరణాన్ని ఆయన ఉదహరించారు.
“బాలు గారు ఆసుపత్రికి వెళ్లినపుడు ఎంతో హుషారుగా వెళ్లారు. నీకేం లేదు వెళ్లవయ్యా అని ఉంటే ప్రాణంతో వచ్చేసేవారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన్ని తీసుకెళ్లి ప్రయోగాలు చేసి చంపేశారు. ఆయనకిచ్చిన మందులు ఎవరికిచ్చినా చనిపోతారు. అసలు మనిషి స్టామినా ఎంత? వాళ్లు ఇచ్చే మందుల పవర్ ఎంత? మనిషి తట్టుకోగలడా? ఈ మందుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంట్లో ఎలుకని చంపాలంటే ఇల్లు తగలబెట్టడం లాగే ఉంది. బాలుగారేమైనా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడా? యాక్సిడెంట్లో పచ్చడైపోయి వెళ్లాడా? ఆసుపత్రికి నడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఆయనలా ఇంకెంతోమంది ఉన్నారు. కేవలం ప్రయోగాలు చేసి, అనవసర మందులు వాడి ఆయన్ని చంపేశారు. బాలుగారి చికిత్సలో లోపాలున్నాయని నేను చెప్పడం కాదు. వందల మంది డాక్టర్లు చెప్పారు” అని వీరమాచనేని అన్నారు.
This post was last modified on May 31, 2021 6:50 am
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…