బ్రహ్మాస్త్ర.. బాలీవుడ్కు ఓ బాహుబలి కాగలదని అంచనాలున్న భారీ చిత్రం. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలొచ్చాయి. రెండేళ్ల కిందటే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లగా.. చిత్రీకరణలో జాప్యం, కరోనా, ఇతర కారణాల వల్ల ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఆలస్యమైంది.
పరిస్థితులను బట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో బ్రహ్మాస్త్ర-1ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక రిలీజ్ డేట్ ప్రకటించాలనుకుంటున్నారు. కాగా సినిమా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. కొంచెం ముందుగానే ప్రమోషన్ హడావుడి మొదలుపెట్టాలనుకుంటున్నారు.
బాలీవుడ్లో సినిమాల ప్రమోషన్ కోసం ఒక బడ్జెట్ కేటాయించి, ఒక పద్ధతి ప్రకారం పబ్లిసిటీ చేస్తారు. బ్రహ్మాస్త్ర విషయంలో ఈ ప్రణాళికలు భారీగానే ఉన్నాయట. ఏకంగా ఈ సినిమా కోసం 13 షార్ట్ టీజర్లు సిద్ధం చేస్తున్నారట. సినిమా రిలీజయ్యేలోపు సమయానుకూలంగా ఈ టీజర్లను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు.. సినిమాలో ఒక్కో పాత్రకు సంబంధించి మోషన్ పోస్టర్లు కూడా వదలబోతున్నారట.
ఇప్పటికే కంటెంట్ అంతా రెడీ అయిందని.. మరికొన్ని రోజుల్లో ప్రమోషనల్ హంగామా మొదలు కాబోతోందని అంటున్నారు. 5 వేల ఏళ్ల కిందటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సోషియా ఫాంటసీ మూవీలో రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ తదితరులు నటించారు.
This post was last modified on May 27, 2021 10:38 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…