తెలుగమ్మాయి ఈషా రెబ్బా కెరీర్ ఆరంభంలో చేసిన అంతకుముందు ఆ తరువాత, బందిపోటు లాంటి సినిమాల్లో కనిపించిన లుక్స్కు, ప్రస్తుతం ఆమె లుక్స్కు అసలేమాత్రం పోలిక కనిపించదు. అప్పటికి తెలుగు హీరోయిన్లంటే మరీ ట్రెడిషనల్ అనే ముద్రకు తగ్గట్లే ఆమె కనిపించింది. కానీ తర్వాతి కొన్నేళ్లలో ఆమె అప్పీయరెన్స్ మారుతూ వచ్చింది. ఇప్పుడు ఉత్తరాది నుంచి దిగుమతి అయిన స్టార్ హీరోయిన్లకు దీటుగా గ్లామర్ విందు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈషా.
సినిమాలను మించి బయట ఫొటో షూట్లతో ఈషా తన సోషల్ మీడియా ఫాలోవర్లను అలరిస్తూ ఉంటుంది. ఆమె ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయ్యేవాళ్లకు తరచుగా గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఆమె ఫొటో షూట్లు కొన్ని చూసి స్టార్ హీరోయిన్లకు ఏం తక్కువ అంటూ కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఈషా షేర్ చేసిన ఫొటోలు చూస్తే గ్లామర్ డోస్ విషయంలో ఆమె నెక్స్ట్ లెవెల్కు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. లింగరీ వేసుకుని క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ పార్కులో పడుకున్న పోజులతో ఉన్న ఈ ఫొటోలు ఈషా ఫాలోవర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటిదాకా ఈషా చేసిన ఫొటో షూట్లలో సెక్సీయెస్ట్ ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఓ పెద్ద సినిమాలో మంచి గ్లామర్ రోల్ ఇవ్వాలే కానీ.. ఈషా ఏ స్టార్ హీరోయిన్కూ తీసిపోని విధంగా యువ ప్రేక్షకులను మెప్పించగలదని ఈ హాట్ లుక్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే చివరగా నెట్ ఫ్లిక్స్ వారి ‘పిట్టకథలు’ యాంథాలజీ ఫిలింలో నటించిన ఈషా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఒక స్పెషల్ రోల్ చేసింది. తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఆమె కథానాయికగా ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం.
This post was last modified on May 26, 2021 10:53 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…