సాయిధరమ్ తేజ్ సినిమా రేయ్ విడుదలై ఆరేళ్లు దాటింది. ఈ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరి దీని కంటే ముందు తీసిన సలీమ్ 2009లో విడుదలైంది. అంటే మధ్యలో ఆరేళ్ల విరామం అన్నమాట. రేయ్ సినిమా మొదలైన నాలుగేళ్లకు కానీ విడుదల కాలేదు. ఒక దశలో ఈ సినిమా రిలీజే కాదని అనుకున్నారు. కానీ చాలా కష్టపడి సినిమాను రిలీజ్ చేయగలిగారు. అంచనాలకు తగ్గట్లే అది డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకు చౌదరి ఆర్థికంగా గట్టి దెబ్బే తిన్నాడు. సంక్షోభంలో పడిపోయాడు. కెరీర్లో చౌదరికి గతంలోనూ ఇలాంటి దెబ్బలు తగిలాయి. కానీ ఇంతకుముందు మాదిరి ఈసారి కోలుకోలేకపోయాడు. రేయ్ తర్వాత కొత్త సినిమా గురించి ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.
మళ్లీ సినిమా తీస్తా.. ఈసారి ప్రేమకథ చేయబోతున్నా.. అందరూ కొత్త వాళ్లే నటిస్తారు.. అంటూ ఎప్పట్నుంచో ఆయన చెబుతూనే ఉన్నాడు. ఈ మాటలతోనే కాలం గడిచిపోతోంది. రెండు రెండేళ్లలో అయితే చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు. ఇండస్ట్రీలో కనిపించడమే మానేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తన పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ మీడియాలోకి వచ్చాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మళ్లీ కొత్త సినిమా గురించి మాట్లాడాడు. కొత్తవాళ్లతో ప్రేమకథ తీయబోతున్నట్లు చెప్పాడు.
దాని గురించి ఆసక్తికర ముచ్చట్లూ పెట్టాడు. అలాగే తన బొమ్మరిల్లు బేనర్ మీద వెబ్ కంటెంట్ కూడా చేయబోతున్నానన్నాడు. ఐతే ఏదో పుట్టిన రోజు వచ్చింది కదా, మీడియా వాళ్లు అడిగారు కదా అని ఎప్పట్లాగా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చాడా.. లేక నిజంగానే ఈసారైనా సినిమా చేసే ఉద్దేశం చౌదరికి ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి ఆయన రంగంలోకి దిగకుంటే ఇంకెప్పుడూ ఆయన మాటల్ని జనాలు నమ్మరేమో.
This post was last modified on May 23, 2021 11:48 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…