సాయిధరమ్ తేజ్ సినిమా రేయ్ విడుదలై ఆరేళ్లు దాటింది. ఈ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరి దీని కంటే ముందు తీసిన సలీమ్ 2009లో విడుదలైంది. అంటే మధ్యలో ఆరేళ్ల విరామం అన్నమాట. రేయ్ సినిమా మొదలైన నాలుగేళ్లకు కానీ విడుదల కాలేదు. ఒక దశలో ఈ సినిమా రిలీజే కాదని అనుకున్నారు. కానీ చాలా కష్టపడి సినిమాను రిలీజ్ చేయగలిగారు. అంచనాలకు తగ్గట్లే అది డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకు చౌదరి ఆర్థికంగా గట్టి దెబ్బే తిన్నాడు. సంక్షోభంలో పడిపోయాడు. కెరీర్లో చౌదరికి గతంలోనూ ఇలాంటి దెబ్బలు తగిలాయి. కానీ ఇంతకుముందు మాదిరి ఈసారి కోలుకోలేకపోయాడు. రేయ్ తర్వాత కొత్త సినిమా గురించి ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.
మళ్లీ సినిమా తీస్తా.. ఈసారి ప్రేమకథ చేయబోతున్నా.. అందరూ కొత్త వాళ్లే నటిస్తారు.. అంటూ ఎప్పట్నుంచో ఆయన చెబుతూనే ఉన్నాడు. ఈ మాటలతోనే కాలం గడిచిపోతోంది. రెండు రెండేళ్లలో అయితే చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు. ఇండస్ట్రీలో కనిపించడమే మానేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తన పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ మీడియాలోకి వచ్చాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మళ్లీ కొత్త సినిమా గురించి మాట్లాడాడు. కొత్తవాళ్లతో ప్రేమకథ తీయబోతున్నట్లు చెప్పాడు.
దాని గురించి ఆసక్తికర ముచ్చట్లూ పెట్టాడు. అలాగే తన బొమ్మరిల్లు బేనర్ మీద వెబ్ కంటెంట్ కూడా చేయబోతున్నానన్నాడు. ఐతే ఏదో పుట్టిన రోజు వచ్చింది కదా, మీడియా వాళ్లు అడిగారు కదా అని ఎప్పట్లాగా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చాడా.. లేక నిజంగానే ఈసారైనా సినిమా చేసే ఉద్దేశం చౌదరికి ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి ఆయన రంగంలోకి దిగకుంటే ఇంకెప్పుడూ ఆయన మాటల్ని జనాలు నమ్మరేమో.
This post was last modified on May 23, 2021 11:48 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…