సాయిధరమ్ తేజ్ సినిమా రేయ్ విడుదలై ఆరేళ్లు దాటింది. ఈ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరి దీని కంటే ముందు తీసిన సలీమ్ 2009లో విడుదలైంది. అంటే మధ్యలో ఆరేళ్ల విరామం అన్నమాట. రేయ్ సినిమా మొదలైన నాలుగేళ్లకు కానీ విడుదల కాలేదు. ఒక దశలో ఈ సినిమా రిలీజే కాదని అనుకున్నారు. కానీ చాలా కష్టపడి సినిమాను రిలీజ్ చేయగలిగారు. అంచనాలకు తగ్గట్లే అది డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకు చౌదరి ఆర్థికంగా గట్టి దెబ్బే తిన్నాడు. సంక్షోభంలో పడిపోయాడు. కెరీర్లో చౌదరికి గతంలోనూ ఇలాంటి దెబ్బలు తగిలాయి. కానీ ఇంతకుముందు మాదిరి ఈసారి కోలుకోలేకపోయాడు. రేయ్ తర్వాత కొత్త సినిమా గురించి ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.
మళ్లీ సినిమా తీస్తా.. ఈసారి ప్రేమకథ చేయబోతున్నా.. అందరూ కొత్త వాళ్లే నటిస్తారు.. అంటూ ఎప్పట్నుంచో ఆయన చెబుతూనే ఉన్నాడు. ఈ మాటలతోనే కాలం గడిచిపోతోంది. రెండు రెండేళ్లలో అయితే చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు. ఇండస్ట్రీలో కనిపించడమే మానేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తన పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ మీడియాలోకి వచ్చాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మళ్లీ కొత్త సినిమా గురించి మాట్లాడాడు. కొత్తవాళ్లతో ప్రేమకథ తీయబోతున్నట్లు చెప్పాడు.
దాని గురించి ఆసక్తికర ముచ్చట్లూ పెట్టాడు. అలాగే తన బొమ్మరిల్లు బేనర్ మీద వెబ్ కంటెంట్ కూడా చేయబోతున్నానన్నాడు. ఐతే ఏదో పుట్టిన రోజు వచ్చింది కదా, మీడియా వాళ్లు అడిగారు కదా అని ఎప్పట్లాగా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చాడా.. లేక నిజంగానే ఈసారైనా సినిమా చేసే ఉద్దేశం చౌదరికి ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి ఆయన రంగంలోకి దిగకుంటే ఇంకెప్పుడూ ఆయన మాటల్ని జనాలు నమ్మరేమో.
This post was last modified on May 23, 2021 11:48 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…