సాయిధరమ్ తేజ్ సినిమా రేయ్ విడుదలై ఆరేళ్లు దాటింది. ఈ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరి దీని కంటే ముందు తీసిన సలీమ్ 2009లో విడుదలైంది. అంటే మధ్యలో ఆరేళ్ల విరామం అన్నమాట. రేయ్ సినిమా మొదలైన నాలుగేళ్లకు కానీ విడుదల కాలేదు. ఒక దశలో ఈ సినిమా రిలీజే కాదని అనుకున్నారు. కానీ చాలా కష్టపడి సినిమాను రిలీజ్ చేయగలిగారు. అంచనాలకు తగ్గట్లే అది డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకు చౌదరి ఆర్థికంగా గట్టి దెబ్బే తిన్నాడు. సంక్షోభంలో పడిపోయాడు. కెరీర్లో చౌదరికి గతంలోనూ ఇలాంటి దెబ్బలు తగిలాయి. కానీ ఇంతకుముందు మాదిరి ఈసారి కోలుకోలేకపోయాడు. రేయ్ తర్వాత కొత్త సినిమా గురించి ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.
మళ్లీ సినిమా తీస్తా.. ఈసారి ప్రేమకథ చేయబోతున్నా.. అందరూ కొత్త వాళ్లే నటిస్తారు.. అంటూ ఎప్పట్నుంచో ఆయన చెబుతూనే ఉన్నాడు. ఈ మాటలతోనే కాలం గడిచిపోతోంది. రెండు రెండేళ్లలో అయితే చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు. ఇండస్ట్రీలో కనిపించడమే మానేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తన పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ మీడియాలోకి వచ్చాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మళ్లీ కొత్త సినిమా గురించి మాట్లాడాడు. కొత్తవాళ్లతో ప్రేమకథ తీయబోతున్నట్లు చెప్పాడు.
దాని గురించి ఆసక్తికర ముచ్చట్లూ పెట్టాడు. అలాగే తన బొమ్మరిల్లు బేనర్ మీద వెబ్ కంటెంట్ కూడా చేయబోతున్నానన్నాడు. ఐతే ఏదో పుట్టిన రోజు వచ్చింది కదా, మీడియా వాళ్లు అడిగారు కదా అని ఎప్పట్లాగా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చాడా.. లేక నిజంగానే ఈసారైనా సినిమా చేసే ఉద్దేశం చౌదరికి ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి ఆయన రంగంలోకి దిగకుంటే ఇంకెప్పుడూ ఆయన మాటల్ని జనాలు నమ్మరేమో.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…