Movie News

శేఖ‌ర్ క‌మ్ముల‌కు చేతులెత్తి మొక్కాలి

లాక్ డౌన్ టైంలో ఎవ‌రి క‌ష్టాలు వాళ్ల‌వి. త‌ట్టా బుట్టా చేత‌బ‌ట్టి, పిల్ల‌ల్ని వెంట బెట్టుకుని వంద‌ల కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న ప్ర‌యాణం చేస్తున్న వ‌ల‌స కార్మికుల దైన్యాన్ని చూస్తున్నాం. సమాజంలో ఇలాంటి అభాగ్యులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ల‌లో ఎవ్వ‌రికీ ప‌ట్ట‌ని హిజ్రాలు కూడా ఉన్నారు. వారికి ఉద్యోగాలుండ‌వు. ప‌నులు దొర‌క‌డ‌మూ క‌ష్టం. ఆధార్ కార్డులు, రేష‌న్ కార్డులూ ఉండ‌వు. మామూలు రోజుల్లో అయితే భిక్షాట‌న చేస్తారు. కొంచెం దౌర్జ‌న్యం చేసి అయినా డ‌బ్బులు తీసుకుంటారు. కానీ ఇప్పుడు అందుకు అవ‌కాశ‌మే లేదు. న‌గ‌రాల్లో వేల మంది హిజ్రాలు తిండికి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వారి మీద ఎవ‌రికీ జాలి ఉండ‌దు. ప్ర‌భుత్వాలు కూడా వారికి సాయం చేయ‌వు. వీరి గురించి ఎవ‌రికీ ప‌ట్ట‌దు.

ఐతే వీరిపై ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల దృష్టి ప‌డింది. ఇప్ప‌టికే హైదరాబాద్ గాంధీ ఆసుప‌త్రి ప‌రిధిలో ప‌ని చేసే వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి శానిటైజేష‌న్ కిట్ల‌తో పాటు ఓ డైరీ సంస్థ సాయంతో నెల రోజుల కింద‌ట్నుంచి రిఫ్రెష్మెంట్స్ అందిస్తూ వారి అభిమానాన్ని చూర‌గొన్నాడు శేఖ‌ర్. అత‌డి సాయానికి వినూత్న రీతిలో కృజ్ఞ‌త‌లు చెప్పిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు శేఖ‌ర్ అండ్ టీం అభాగ్యులైన‌ హిజ్రాల మీద దృష్టిసారించింది. వంద‌ల మంది హిజ్రాల‌కు నిత్యావ‌స‌రాలు స‌ర‌ఫ‌రా చేసింది. ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి వారిని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు శేఖ‌ర్. తిండిలేక ఇబ్బంది ప‌డుతున్న హిజ్రాలు ఎవ‌రైనా కాంటాక్ట్ చేయొచ్చంటూ శేఖ‌ర్ టీం ఫోన్ నంబ‌ర్లు కూడా ఇచ్చింది. సాయం కోరిన వాళ్లంద‌రినీ ఆదుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి వాళ్ల క‌ష్టాల్ని గుర్తించిన శేఖ‌ర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.

This post was last modified on May 15, 2020 11:56 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago