Movie News

తుఫాన్ దెబ్బ‌కు ఆ నిర్మాతకు 30 కోట్ల న‌ష్టం


క‌రోనా క‌ష్టాలు చాల‌వ‌ని ఇండియాను కొన్ని రోజులుగా తౌక్టే తుఫాను ఎలా వ‌ణికించేస్తోందో.. దాని వ‌ల్ల‌ ఎంత న‌ష్టం వాటిల్లుతోందో తెలిసిందే. ముంబ‌యి స‌హా కొన్ని న‌గ‌రాలు తుఫాను ధాటికి వ‌ణికిపోయాయి. భారీ వ‌ర్షాలు ఎన్నోసార్లు ముంబ‌యి న‌గ‌రాన్ని ముంచెత్త‌డం చూశాం. అప్ప‌టికంటే ఎక్కువ‌గా తౌక్టే తుపాను న‌గ‌రాన్ని దెబ్బ తీసింది.

తాజ్ హోట‌ల్ ముందు స‌ముద్ర‌పు నీరు రోడ్ల మీదికి వ‌చ్చి అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు త‌లెత్తిన వీడియోను సోష‌ల్ మీడియాలో చాలామంది చూసే ఉంటారు. అది చూశాక న‌గ‌రం ఎంత‌గా దెబ్బ తిని ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. అస‌లే క‌రోనా ధాటికి దారుణంగా న‌ష్ట‌పోయిన బాలీవుడ్‌ను ఈ తుపాను కూడా గ‌ట్టి దెబ్బే తీసింది. బాలీవుడ్‌కు కేంద్ర‌మైన ముంబ‌యిలో సినిమా స్టూడియోలపై తుపాను బాగా ప్ర‌భావం చూపింది. అనేక సెట్టింగ్స్ దెబ్బ తిన్నాయి. వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది.


కేవ‌లం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కార‌ణంగా రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. ఫుట్ బాల్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా కోసం ముంబ‌యిలో భారీ సెట్టింగ్స్ నిర్మించారు. క‌రోనా నేప‌థ్యంలో పూర్తిగా ఈ సెట్టింగ్స్‌లోనే సినిమా తీయ‌డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే ఆ సెట్టింగ్స్ అన్నీ తుపాను కార‌ణంగా పూర్తిగా దెబ్బ తిన‌డంతో రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత బోనీక‌పూర్ స్వ‌యంగా మీడియాకు తెలిపాడు.

ఇక హైద‌రాబాద్‌లోనూ కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌గా.. ఆ ధాటికి నాని చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ చిత్ర నిర్మాత‌కు ఆరున్న‌ర కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భారీ ఖ‌ర్చుతో వేసిన‌ కోల్‌క‌తా సెట్ పూర్తిగా దెబ్బ తింద‌ట‌. ఇక్క‌డ ప‌ది రోజుల షూటింగ్ మాత్ర‌మే చేశారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగింది. మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక షూటింగ్ అనుకున్నారు కానీ.. ఈలోపు వ‌ర్షాల వ‌ల్ల ఆ సెట్ దెబ్బ తిని, మ‌ళ్లీ కొత్త‌గా వేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ట‌.

This post was last modified on May 22, 2021 11:03 am

Share
Show comments

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago