కరోనా కష్టాలు చాలవని ఇండియాను కొన్ని రోజులుగా తౌక్టే తుఫాను ఎలా వణికించేస్తోందో.. దాని వల్ల ఎంత నష్టం వాటిల్లుతోందో తెలిసిందే. ముంబయి సహా కొన్ని నగరాలు తుఫాను ధాటికి వణికిపోయాయి. భారీ వర్షాలు ఎన్నోసార్లు ముంబయి నగరాన్ని ముంచెత్తడం చూశాం. అప్పటికంటే ఎక్కువగా తౌక్టే తుపాను నగరాన్ని దెబ్బ తీసింది.
తాజ్ హోటల్ ముందు సముద్రపు నీరు రోడ్ల మీదికి వచ్చి అల్లకల్లోల పరిస్థితులు తలెత్తిన వీడియోను సోషల్ మీడియాలో చాలామంది చూసే ఉంటారు. అది చూశాక నగరం ఎంతగా దెబ్బ తిని ఉంటుందో అంచనా వేయొచ్చు. అసలే కరోనా ధాటికి దారుణంగా నష్టపోయిన బాలీవుడ్ను ఈ తుపాను కూడా గట్టి దెబ్బే తీసింది. బాలీవుడ్కు కేంద్రమైన ముంబయిలో సినిమా స్టూడియోలపై తుపాను బాగా ప్రభావం చూపింది. అనేక సెట్టింగ్స్ దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది.
కేవలం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్టింగ్స్ నిర్మించారు. కరోనా నేపథ్యంలో పూర్తిగా ఈ సెట్టింగ్స్లోనే సినిమా తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే ఆ సెట్టింగ్స్ అన్నీ తుపాను కారణంగా పూర్తిగా దెబ్బ తినడంతో రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని నిర్మాత బోనీకపూర్ స్వయంగా మీడియాకు తెలిపాడు.
ఇక హైదరాబాద్లోనూ కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆ ధాటికి నాని చిత్రం శ్యామ్ సింగరాయ్ చిత్ర నిర్మాతకు ఆరున్నర కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో భారీ ఖర్చుతో వేసిన కోల్కతా సెట్ పూర్తిగా దెబ్బ తిందట. ఇక్కడ పది రోజుల షూటింగ్ మాత్రమే చేశారు. కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ అనుకున్నారు కానీ.. ఈలోపు వర్షాల వల్ల ఆ సెట్ దెబ్బ తిని, మళ్లీ కొత్తగా వేయాల్సిన పరిస్థితి తలెత్తిందట.
This post was last modified on May 22, 2021 11:03 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…