Chiranjeevi
కొవిడ్ టైంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది లాక్ డౌన్ ధాటికి సినీ పరిశ్రమ షట్ డౌన్ అయితే కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించి సహాయ నిధిని ఆరంభించాడు మెగాస్టార్. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది సెలబ్రెటీలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. ఆ నిధితో నెలల పాటు సినీ కార్మికులు నిత్యావసరాలు అందిస్తూ వచ్చింది చిరు నేతృత్వంలోని కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ.
ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి చిరు టీం అదే రీతిలో సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. కొవిడ్ టైంలో హైదరాబాద్లో రక్త కొరత ఏర్పడకుండా చూడటంలో చిరు బ్లడ్ బ్యాంక్ది కీలక పాత్ర. అలాగే కరోనా చికిత్సలో ప్లాస్మా కీలకంగా ఉన్నపుడు పోలీసులతో కలిసి ప్లాస్మా డొనేషన్ మీద జనాల్లో అవగాహన పెంచి కొవిడ్ విజేతలను అటు వైపు నడిపించడంలోనూ చిరు కీలకంగా ఉన్నాడు.
ఇక ఇండస్ట్రీలో ఎవరు కష్టాల్లో ఉన్నా వెంటనే తన వంతుగా విరాళాలు ప్రకటిస్తూ చిరు తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. టీఎన్ఆర్, పావలా శ్యామల లాంటి వాళ్లకు ఆయన సాయం అందించడం తెలిసిందే. ఇప్పుడు చిరు ఒక గొప్ప పనికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు సరిపడా లేక కొవిడ్ బాధితులు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. ఈ కారణంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తకుండా ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా తమ ప్రయత్నం తాము చేస్తుండగా.. చిరు తన బాధ్యతగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు. ఇందుకు కోట్లల్లోనే ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈ పని చేపడితే బ్లడ్ బ్యాంకు తర్వాత చిరు సొసైటీకి చేస్తున్న అది పెద్ద సేవా కార్యక్రమంగా ప్రశంసలందుకోవడం ఖాయం.
This post was last modified on May 20, 2021 9:18 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…