కర్ణన్.. కర్ణన్.. గత నెలన్నర రోజుల నుంచి సౌత్ ఇండియాలో చర్చనీయాంశంగా మారిన సినిమా. గత నెల 9న థియేటర్లలో విడుదలై మంచి ఫలితాన్నందుకున్న ఈ చిత్రం.. ఇటీవలే అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్లో రిలీజైంది. దీంతో ఈ సినిమా రీచ్ మరింత పెరిగింది. వివిధ భాషల వాళ్లు సబ్ టైటిల్స్ పెట్టుకుని సినిమా చూస్తున్నారు. కర్ణన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఒకటిగా కర్ణన్ను కొనియాడుతున్నారు.
ఇక ధనుష్ నటన గురించి చెప్పేదేముంది? ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించాడు. రెండు జాతీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. ధనుష్ సినిమాను ఎవరైనా రీమేక్ చేస్తుంటే.. పెర్ఫామెన్స్లో అతణ్ని మ్యాచ్ చేయగలరా అన్న సందేహాలు కలుగుతుంటాయి. ధనుష్ చేసిన అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ లాంటి సీనియర్ నటుడు చేస్తుండటం గమనార్హం. వెంకీ అయితే ధనుష్ను మ్యాచ్ చేయగలడనే అభిప్రాయాలున్నాయి.
కానీ కర్ణన్ లాంటి గొప్ప సినిమాను తెలుగులో బెల్లంకొడ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయనున్నారని కొన్ని రోజుల కిందట ప్రకటన వచ్చింది. అప్పుడే చాలామంది పెదవి విరిచారు. ఇక అమేజాన్ ప్రైమ్లో కర్ణన్ను ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు. వాళ్లందరికీ రీమేక్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఊర మాస్ సినిమాలు చేసుకునే బెల్లంకొండ శ్రీనివాస్తో కర్ణన్ లాంటి సినిమాను రీమేక్ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ధనుష్ లాంటి నటుడిని అతను ఎలా మ్యాచ్ చేస్తాడనే సందేహాలూ కలుగుతున్నాయి.
మామూలు సినిమాల్లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ నటన గురించి ట్రోల్ జరుగుతుంటుంది. అలాంటిది ఎంతో డెప్త్ ఉన్న కర్ణన్ పాత్రను అతను చేయబోతున్నాడంటే ఆ ఊహే చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఈ పాత్ర కచ్చితంగా దెబ్బ తింటుందని.. దీని మేకర్స్ ఈ విషయంలో పునరాలోచించుకోవాల్సిందే అని బలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 20, 2021 8:47 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…