Movie News

ఈ రెండు సినిమాలు చూసి తీరాల్సిందే


ఇండియాలో మరోసారి మెజారిటీ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో కొత్త సినీ వినోదం కోసం ప్రేక్షకులు ఓటీటీల వైపే చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రిలీజైన రెండు దక్షిణాది చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి తమిళ చిత్రం ‘కర్ణన్’ కాగా.. ఇంకోటి మలయాళ సినిమా ‘నాయట్టు’. ధనుష్ సినిమా ‘కర్ణన్’ గత నెల 9న థియేటర్లలో రిలీజైనపుడే దాని గురించి పెద్ద చర్చ జరిగింది. 90వ దశకంలో తమిళనాడులోని ఒక ప్రాంతంలో జరిగిన కుల ఘర్షణల నేపథ్యంలో యువ దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

మారి తొలి సినిమా ‘పరియేరుమ్ పెరుమాళ్’ మాదిరే ఇది కూడా సమాజంలోని అణగారిన వర్గాల మీద దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్ష చుట్టూ తిరిగే చిత్రమే. ఎక్కడా ఫలానా కులం అని చెప్పరు కానీ.. ముఖ్యంగా దళితులకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల చుట్టూనే ఆ కథ నడుస్తుంది. దానికి జాతీయ అవార్డు సైతం వచ్చింది. ‘పరియేరుమ్..’కు ఏమాత్రం తగ్గని విధంగా రెండో చిత్రాన్ని కూడా ఒక క్లాసిక్ లాగా తీర్చిదిద్దాడు మారి. ఈసారి అతడికి ధనుష్ లాంటి మేటి నటుడు దొరకడంతో సినిమా మరింత బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. జనాల్లో ఒక కదలిక తీసుకొచ్చే చిత్రం ఇదనడంలో సందేహం లేదు.

ఇక ‘నాయట్టు’ విషయానికి వస్తే కుంచుకోబోబన్, జోజు జార్జ్, నిమిష ప్రధాన పాత్రల్లో మార్టిన్ ప్రకట్ రూపొందించిన ఈ చిత్రం.. కుల రాజకీయాల చుట్టూ తిరిగేదే. అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించి తమ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు వ్యవస్థలో భాగమైన వ్యక్తులను ఎలా బలి చేస్తారనే కథాంశంతో ఈ హార్డ్ హిట్టింగ్ డ్రామాను తీర్చిదిద్దాడు మార్టిన్. ఇది కూడా జనాలను కదిలించి వారిలో ఒక ఆలోచన తీసుకొచ్చే చిత్రమే. ఈ సినిమాకు థియేటర్లలో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఓటీటీలోనూ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది. ‘కర్ణన్’ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. ‘నాయట్టు’ నెట్ ఫ్లిక్స్‌లో నడుస్తోంది. ఇంకా ఈ సినిమాలను చూడకుంటే తప్పకుండా ఒక లుక్కేయాల్సిందే.

This post was last modified on May 20, 2021 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

51 minutes ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

4 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

6 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

6 hours ago

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…

6 hours ago

పైరసీని ఆపడానికి యాప్

సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…

7 hours ago