గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణతో లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి అసమాన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా ప్రశంసలందుకుంటూ వస్తున్నాడు సోనూ. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ అతను అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అతడి ఉద్దేశాల మీద కొందరికి అభ్యంతరాలున్నాయి. తన సేవ గురించి అతిగా ప్రచారం చేసుకుంటున్నాడని.. కొన్ని ఫేక్ ప్రచారాలు కూడా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు విఫలమవుతున్న చోట సోనూ ఆపద్బాంధవుడిలా మారి సాయం అందిస్తుండటంతో అధికార పార్టీల మద్దతుదారులు అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య పనిగట్టుకుని సోనూను తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే సోనూ చేసిన ఒక ట్వీట్ గురించి చిన్న రాద్దాంతం జరిగింది.
ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఒక వ్యక్తికి ఆక్సిజన్ బెడ్ అవసరమని సోనూ టీంకు రిక్వెస్ట్ వచ్చింది. కాసేపటికే సదరు వ్యక్తికి బెడ్ అరేంజ్ చేసినట్లుగా సోనూ ఒక ట్వీట్ పెట్టాడు. ఐతే కాసేపటి తర్వాత దీనిపై గంజాం జిల్లా కలెక్టర్ స్పందించారు. బాధితుడికి తామే బెడ్ అరేంజ్ చేశామని.. సోనూ టీం నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొంటూ కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మెసేజ్ పోస్ట్ అయింది. దీంతో అందరూ సోనూను అనుమానించడం మొదలుపెట్టారు. కానీ తర్వాత సోనూ అసలు విషయం చెప్పాడు. బాధితుడు తమను ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్ కోసం వాట్సాప్ ద్వారా సంప్రదించడం.. తాము అరేంజ్ చేయడం.. అతను కృతజ్ఞతలు చెప్పడం.. ఈ మొత్తం మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోనూ షేర్ చేశాడు.
తాము ప్రభుత్వ వర్గాలను సంప్రదించినట్లు ఎక్కడా క్లెయిమ్ చేసుకోలేదని.. ఏదో ఒక మార్గంలో బాధితుడికి బెడ్ అందేలా మాత్రం చూశామని.. కావాలంటే ఆ వ్యక్తితో తమ సంభాషణను పరిశీలించుకోవచ్చని అన్నాడు. అలాగని ప్రభుత్వ వర్గాలను తక్కువ చేయకుండా వారు చేస్తున్న మంచి పనులను సోనూ ప్రశంసించడం గమనార్హం.
This post was last modified on May 18, 2021 9:28 am
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…