గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణతో లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి అసమాన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా ప్రశంసలందుకుంటూ వస్తున్నాడు సోనూ. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ అతను అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అతడి ఉద్దేశాల మీద కొందరికి అభ్యంతరాలున్నాయి. తన సేవ గురించి అతిగా ప్రచారం చేసుకుంటున్నాడని.. కొన్ని ఫేక్ ప్రచారాలు కూడా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు విఫలమవుతున్న చోట సోనూ ఆపద్బాంధవుడిలా మారి సాయం అందిస్తుండటంతో అధికార పార్టీల మద్దతుదారులు అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య పనిగట్టుకుని సోనూను తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే సోనూ చేసిన ఒక ట్వీట్ గురించి చిన్న రాద్దాంతం జరిగింది.
ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఒక వ్యక్తికి ఆక్సిజన్ బెడ్ అవసరమని సోనూ టీంకు రిక్వెస్ట్ వచ్చింది. కాసేపటికే సదరు వ్యక్తికి బెడ్ అరేంజ్ చేసినట్లుగా సోనూ ఒక ట్వీట్ పెట్టాడు. ఐతే కాసేపటి తర్వాత దీనిపై గంజాం జిల్లా కలెక్టర్ స్పందించారు. బాధితుడికి తామే బెడ్ అరేంజ్ చేశామని.. సోనూ టీం నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొంటూ కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మెసేజ్ పోస్ట్ అయింది. దీంతో అందరూ సోనూను అనుమానించడం మొదలుపెట్టారు. కానీ తర్వాత సోనూ అసలు విషయం చెప్పాడు. బాధితుడు తమను ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్ కోసం వాట్సాప్ ద్వారా సంప్రదించడం.. తాము అరేంజ్ చేయడం.. అతను కృతజ్ఞతలు చెప్పడం.. ఈ మొత్తం మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోనూ షేర్ చేశాడు.
తాము ప్రభుత్వ వర్గాలను సంప్రదించినట్లు ఎక్కడా క్లెయిమ్ చేసుకోలేదని.. ఏదో ఒక మార్గంలో బాధితుడికి బెడ్ అందేలా మాత్రం చూశామని.. కావాలంటే ఆ వ్యక్తితో తమ సంభాషణను పరిశీలించుకోవచ్చని అన్నాడు. అలాగని ప్రభుత్వ వర్గాలను తక్కువ చేయకుండా వారు చేస్తున్న మంచి పనులను సోనూ ప్రశంసించడం గమనార్హం.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…