ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాను ప్రకటించారు. ముందు అనుకున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కాకుండా తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు తారక్. అనూహ్య పరిణామాల మధ్య ఈ చిత్రానికి దర్శకుడు మారాడు.
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఈ సినిమానే చేయబోతున్నట్లుగా ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రకటన ఇచ్చారు. ఐతే తారక్ అభిమానుల దృష్టి ఉన్నది మాత్రం వేరే చిత్రం మీద. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో తారక్ ఎప్పుడు సినిమా చేస్తాడు.. దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అని వాళ్లు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్, మైత్రీ సంస్థ అధినేతలు.. అలాగే తారక్ వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా గురించి సంకేతాలు ఇచ్చారు. కానీ అధికారికంగా ఘనమైన ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దాని మీదే అభిమానుల దృష్టి ఉంది. మధ్యలో అనుకోకుండా ప్రశాంత్ సలార్ సినిమాను తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ ఇలా ఇంకో సినిమా ఏదైనా వచ్చి పడుతుందేమో అన్న కంగారు కూడా వారిలో లేక పోలేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి.. ఆ సినిమా ఎప్పుడు మొదలై, ఎప్పుడు విడుదలవుతుందో ఒక క్లారిటీ వస్తే బాగుండని అనుకుంటున్నారు. ఐతే ఇందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయనున్న సినిమా గురించి ఒక పోస్టర్ ద్వారా ఘనంగా అనౌన్స్మెంట్ ఇవ్వబోతోందట మైత్రీ సంస్థ.
సినిమా ఎప్పుడు మొదలయ్యేది.. ఎప్పుడు రిలీజయ్యేది కూడా ఈ పోస్టర్లో ప్రకటిస్తారని అంటున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ టీం నుంచి తారక్ పుట్టిన రోజు నాడు కొత్త పోస్టర్ కూడా వదలనున్నారట. కొరటాల సినిమా నుంచి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on May 18, 2021 8:30 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…