తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మెజారిటీ సినిమాల్లో ఒకే యాస ఉండేది. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువమందికి కనెక్ట్ అయ్యే తెలుగునే సినిమాల్లో వాడేవాళ్లు. కామెడీ కోసమో, విలనీ కోసమో ఇతర ప్రాంతాల యాసను వాడుకునేవాళ్లు తప్ప వేరే యాసల్లో పూర్తి స్థాయి సినిమాలు రావడం అరుదుగానే జరిగేది. ఐతే 90వ దశకం చివర్లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలవడంతో తొలిసారిగా రాయలసీమ యాసకు తెలుగు సినిమాల్లో ప్రాధాన్యం పెరిగింది. కానీ ఈ సినిమాలు ఒక దశ దాటాక ఒక మూసలోకి వెళ్లిపోయాయి. సీమ యాస కూడా మొనాటనీ అయిపోయేలా చేశారు. ఐతే రాయల సీమ అంటే అంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపించే యాస మాత్రమే కాదు. అక్కడ కూడా ప్రాంతాలను బట్టి రకరకాల యాసలుంటాయి.
ముఖ్యంగా సీమలో చిత్తూరు జిల్లా యాస ప్రత్యేకం. ఆ జిల్లాలో పూర్తిగా ఒక యాస అంటూ ఉండదు. తమిళనాడు బోర్డర్లో ఉండే చిత్తూరు-తిరుపతి లాంటి ప్రాంతాల్లో తమిళ యాస కలిసిన భాషలో మాట్లాడతారు. ఈ యాసను నాని సినిమా ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’లో దర్శకుడు మేర్లపాక గాంధీ (తిరుపతి వాడే) భలేగా వాడుకున్నాడు. ఐతే ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఆ యాస అంతగా పాపులర్ కాలేదు. ఇక చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి వైపు వెళ్తే నెల్లూరు, ఆంధ్రా ప్రభావం కనిపిస్తుంది. ఆ యాస అంత కొత్తగా ఏమీ కనిపించదు. ఐతే కుప్పం, పలమనేరు, పుంగనూరు లాంటి చోట్ల యాస మరో రకంగా ఉంటుంది. అక్కడి భాష, యాసపై కర్ణాటక ప్రభావం చాలా ఉంటుంది. ఈ యాసను ఇప్పటిదాకా ఎవ్వరూ పెద్దగా ఎలివేట్ చేయలేదు. సినిమాల్లో అయితే ఈ యాసను దాదాపుగా ఎప్పుడూ విని ఉండం. ఐతే తొలిసారిగా ‘సినిమా బండి’ చిత్రం పూర్తిగా ఈ యాసలోనే సాగడం విశేషం.
చిత్తూరు జిల్లాకే చెందిన బాలీవుడ్ దర్శకుడు రాజ్-డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ కంద్రేగుల అనే ఈ జిల్లాకు చెందిన కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నటీనటులంతా ఈ ప్రాంతం వాళ్లనే తీసుకోవడంతో వాళ్లు తమ ప్రాంత యాసతో అదరగొట్టేశారు. ఇంతకుముందెన్నడూ వినని యాస, మాండలికాలు కావడంతో ‘సినిమా బండి’ కొత్త అనుభూతిని పంచుతోంది. ‘నీకేం పని లేదా’ అనే మాటనే ఈ ప్రాంతంలో ‘నీకేం పంగ లేదా’ అంటారు. ఇలాంటి కొత్త మాటలు చాలానే సినిమాలో వింటాం. కొన్ని పదాలు వేరే ప్రాంతాల వాళ్లకు అర్థం కాకపోయినా ఈ భాష, యాస కొత్తగా ఉండి ప్రేక్షకులు కొత్త అనుభూతిని లోనవుతున్నారు. త్వరలో రాబోతున్న సుకుమార్-అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ చిత్తూరు నేపథ్యంలోనే సాగనుంది. అది భారీ చిత్రం కాబట్టి చిత్తూరు భాష, యాసకు మంచి పాపులారిటీనే వచ్చే అవకాశముంది.
This post was last modified on May 16, 2021 2:23 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…