బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ మారిపోయినట్లే ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల ఇమేజ్ కూడా మారిపోతుందని.. వాళ్లు పాన్ ఇండియా స్టార్లు అయిపోతారని అంచనాలున్నాయి. పెరిగే తమ స్థాయికి తగ్గట్లే భారీ ప్రాజెక్టులు సెట్ చేసుకుని ఇంకా పెద్ద రేంజికి వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో సినిమాలు ఓకే చేసుకుని ఆర్ఆర్ఆర్ తర్వాత తన కెరీర్ను తారక్ బాగానే ప్లాన్ చేసుకున్నాడు.
ఐతే రామ్ చరణ్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. రెండు నెలల ముందు వరకు ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సినిమా ఏదో క్లారిటీనే లేదు. ఐతే తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో సినిమాను ఓకే చేసుకుని అభిమానులతో వావ్ అనిపించుకున్నాడు. శంకర్ లాంటి దర్శకుడితో భలేగా సినిమా సెట్ చేసుకున్నాడే అని అందరూ మురిసిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఈ ప్రాజెక్టుపై రకరకాల సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ఇండియన్-2 సినిమాను మధ్యలో వదిలేసి శంకర్ చరణ్తో సినిమా చేస్తానంటే లైకా అధినేతలు అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి వాళ్లు సిద్ధమైనట్లే ఉన్నారు. దీనిపై తెలుగు ఫిలిం చాంబర్కు సైతం లేఖ రాయడంతో దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత మరో ప్రొడ్యూసర్ బాధను అర్థం చేసుకోకుండా తన సినిమాను ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి.
మరోవైపు కమల్ హాసన్ కూడా రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించి ఇండియన్-2ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శంకర్కు ఛాయిస్ లేనట్లే. ఆ సినిమా పూర్తయ్యాకే చరణ్ సినిమాను మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇండియన్-2తో తలనొప్పులు చాలానే ఉన్నాయి. కాబట్టి అది మళ్లీ మొదలుపెడితే ఇంకో ఏడాది పాటు శంకర్ బయటపడకపోవచ్చు. ఈలోపు చరణ్ ఖాళీగా ఉండటం కష్టం. కాబట్టి చరణ్.. శంకర్నే నమ్ముకోకుండా తన కోసం లైన్లో ఉన్న ఇతర దర్శకుల్లో ఒకరితో ఓ సినిమా లాగించేయడం బెటరేమో.
This post was last modified on May 16, 2021 10:00 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…