టాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆ మల్టీస్టారర్లో నటించేది సీనియర్ హీరో రాజశేఖర్.. ఆయన తర్వాతి తరం కథానాయకుడు గోపీచంద్ అట. లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం లాంటి మాస్ ఎంటర్టైనర్లు తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.
‘లక్ష్యం’తో తనపై బాగా అంచనాలు పెంచేసిన శ్రీవాస్.. ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. మధ్యలో ‘లౌక్యం’తో ఓకే అనిపించాడు కానీ.. మిగతా సినిమాలు నిరాశ పరిచాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సాక్ష్యం’ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడు.
ఈ సినిమా వచ్చాక దాదాపు మూడేళ్ల నుంచి అతను ఖాళీగా ఉన్నాడు. గోపీచంద్తోనే ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఇంకో సినిమా కూడా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది.
ఐతే ఎట్టకేలకు ఓ కథను ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించి మల్టీస్టారర్ చేయడానికి శ్రీవాస్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’తో మళ్లీ ఫామ్ అందుకుని వరుసగా సినిమాలు చేస్తున్న రాజశేఖర్.. మళ్లీ మంచి హిట్టు కోసం చూస్తున్న గోపీచంద్లతో అతను మల్టీస్టారర్ చేయనున్నాడట. ఈ ఇద్దరు హీరోలూ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.
ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నాడట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ‘శేఖర్’తో పాటు మరో రెండు థ్రిల్లర్ సినిమాలను స్వల్ప వ్యవధిలో అనౌన్స్ చేయడం తెలిసిందే. ఆ సినిమాల తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన మల్టీస్టారర్ చేయనున్నాడట. గోపీచంద్ విషయానికి వస్తే ‘సీటీమార్’ను పూర్తి చేసి ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడతను.
This post was last modified on May 15, 2021 3:43 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…