Movie News

రాజశేఖర్-గోపీచంద్ మల్టీస్టారర్?

టాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆ మల్టీస్టారర్లో నటించేది సీనియర్ హీరో రాజశేఖర్.. ఆయన తర్వాతి తరం కథానాయకుడు గోపీచంద్ అట. లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం లాంటి మాస్ ఎంటర్టైనర్లు తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.

‘లక్ష్యం’తో తనపై బాగా అంచనాలు పెంచేసిన శ్రీవాస్.. ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. మధ్యలో ‘లౌక్యం’తో ఓకే అనిపించాడు కానీ.. మిగతా సినిమాలు నిరాశ పరిచాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సాక్ష్యం’ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడు.

ఈ సినిమా వచ్చాక దాదాపు మూడేళ్ల నుంచి అతను ఖాళీగా ఉన్నాడు. గోపీచంద్‌తోనే ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఇంకో సినిమా కూడా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది.

ఐతే ఎట్టకేలకు ఓ కథను ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించి మల్టీస్టారర్ చేయడానికి శ్రీవాస్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’తో మళ్లీ ఫామ్ అందుకుని వరుసగా సినిమాలు చేస్తున్న రాజశేఖర్.. మళ్లీ మంచి హిట్టు కోసం చూస్తున్న గోపీచంద్‌లతో అతను మల్టీస్టారర్ చేయనున్నాడట. ఈ ఇద్దరు హీరోలూ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.

ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నాడట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ‘శేఖర్’తో పాటు మరో రెండు థ్రిల్లర్ సినిమాలను స్వల్ప వ్యవధిలో అనౌన్స్ చేయడం తెలిసిందే. ఆ సినిమాల తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన మల్టీస్టారర్ చేయనున్నాడట. గోపీచంద్ విషయానికి వస్తే ‘సీటీమార్’ను పూర్తి చేసి ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడతను.

This post was last modified on May 15, 2021 3:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

6 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

44 minutes ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

2 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

2 hours ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

4 hours ago