‘అరవింద సమేత’ తర్వాత రెండేళ్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’కు అంకితమైపోయి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీని తర్వాత అతడి సినిమాల లైనప్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందుగా తనకు ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అతను ఓ సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అప్పుడప్పుడూ అప్డేట్లు వస్తున్నాయి కానీ.. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడింది లేదు.
‘కేజీఎఫ్-2’ పూర్తవగానే ఎన్టీఆర్తో సినిమా అనుకుంటే ప్రశాంత్ ఉన్నట్లుండి ‘సలార్’ను ముందుకు తీసుకురావడం, మధ్యలో అల్లు అర్జున్ సైతం ప్రశాంత్తో ఓ సినిమా కోసం చర్చలు జరపడంతో ఎన్టీఆర్-ప్రశాంత్ సినిమా మీద కొంత సందేహాలు నెలకొన్నాయి.
ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ తొలిసారిగా ప్రశాంత్ నీల్తో చేయబోయే సినిమా గురించి నోరు విప్పాడు. ప్రస్తుతం కరోనా బారిన పడి ఇంట్లో కోలుకుంటున్న తారక్.. అంతర్జాతీయ ఫిలిం ట్రేడ్ పబ్లికేషన్ ‘డెడ్ లైన్’కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తారక్ కరోనా పాజిటివ్గా తేలడానికి ముందు ఇచ్చాడా, తర్వాతా అన్నది తెలియదు. ఐతే ఆ ఇంటర్వ్యూ మాత్రం తాజాగా పబ్లిష్ అయింది.
ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే అని తారక్ ధ్రువీకరించాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత తమ కలయికలో రానున్న సినిమా కోసం ఉత్సాహంగా ఉన్నానని.. ఐతే ఈ సినిమాకు ఇంకా స్క్రిప్టు పూర్తి కాలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమా కోసం ఒక ఐడియా అనుకున్నామని, అది తనకెంతో నచ్చిందని, దాని మీద వర్క్ జరుగుతోందని తారక్ తెలిపాడు. ఈ చిత్రం తర్వాత తాను ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో నటించబోతున్నట్లు ధ్రువీకరించిన తారక్.. అంతకుమించి ఆ ప్రాజెక్టు గురించి వివరాలేమీ చెప్పలేదు.
This post was last modified on May 13, 2021 8:44 am
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…