Movie News

పుష్ప’ నిర్మాత చెప్పేశాడు


అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లుగా కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. కానీ చిత్ర బృందంలో మాత్రం దీని గురించి గట్టిగానే ఆలోచిస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. మే నెలాఖరుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు కూడా యూనిట్ వర్గాలు చెప్పాయి.

ఐతే ఈలోపే మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై స్పష్టత ఇచ్చేశారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే ‘పుష్ప’ సినిమాను పార్ట్-1, పార్ట్-2గా విడుదల చేయబోతున్న విషయం వాస్తవమే అని ఆయన ధ్రువీకరించారు. దీనిపై దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌తో కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

“ఎంతో స్పాన్ ఉన్న ‘పుష్ప’ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే అల్లు అర్జున్, సుకుమార్ గారితో చర్చించి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం. మొదటి భాగం పూర్తి అయి రిలీజ్ కాగానే రెండో భాగం మొదలుపెడతాం. రెండో భాగం కోసం అనుకున్న కథలో ఇప్పటికే 10 శాతం చిత్రీకరణ పూర్తయింది” అని రవిశంకర్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

స్వయంగా నిర్మాత చెప్పాడు అంటే ‘పుష్ప’ రెండు భాగాలుగా రాబోతుందన్న విషయం ఖరారైనట్లే. ఇంతకుముందు బాహుబలి ఇలాగే ఒక సినిమాగా మొదలై, మేకింగ్ మధ్యలో ఉండగా రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళి అండ్ కో నిర్ణయించారు. ‘కేజీఎఫ్’ సినిమాను మాత్రం మొదలైనపుడే చాప్టర్-1, చాప్టర్-2గా రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ వరుసలో ‘పుష్ప’ లాంటి మరో భారీ చిత్రం రెండు భాగాల రిలీజ్‌కు రెడీ అవుతోంది.

This post was last modified on May 12, 2021 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

35 minutes ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

5 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

6 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

7 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

7 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

8 hours ago