దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న సమయంలో ఓ భారీ చిత్రం విడుదలకు సిద్ధం కావడం విశేషమే. సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘రాధె’ను రంజాన్ కానుకగా ఈ నెల 13న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం.. దానికి కట్టుబడి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుండటం తెలిసిందే. ఒకేసారి థియేటర్లతో పాటు ‘జీ’ ఓటీటీ, కొన్ని డీటీహెచ్ల ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగానో, పూర్తి స్థాయిలోనో లాక్ డౌన్ అమలవుతోంది. దాదాపుగా అన్ని చోట్లా థియేటర్లు మూతపడే ఉన్నాయి. ఎక్కడా అవి తెరిచి ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటపుడు ‘రాధె’ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ ఏంటి అనే సందేహం కలగడం ఖాయం.
ఈ సినిమాను మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసినప్పటికి, ఇప్పటికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తాజాగా తెలంగాణలో లాక్డౌన్లో భాగంగా థియేటర్లను పూర్తిగా మూసి వేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఇండియా వరకు చూసుకుంటే ‘రాధె’ సినిమా పేరుకే థియేటర్లలో రిలీజవుతోంది. దాదాపుగా ఎక్కడా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చు. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాను ‘జీ’లో లేదా డీటీహెచ్ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో చూసుకోవాల్సిందే. మరి దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డపుడు థియేట్రికల్ రిలీజ్ ఎందుకు అనే సందేహం రావచ్చు. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ల మీద ఫోకస్తోనే. మన దగ్గర ఉన్నంతగా కరోనా తీవ్రత ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. యుఎస్, యూకే, గల్ఫ్ కంట్రీస్ సహా భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్లు ఉన్న దేశాల్లో థియేటర్లు బాగానే నడుస్తున్నాయి. చాన్నాళ్లుగా సరైన హిందీ సినిమా ఏదీ అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ కాలేదు. అందరూ తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు.
ఇలాంటి టైంలో సల్మాన్ సినిమాను అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిలో రిలీజ్ చేసుకుని భారీగా ఆదాయం అందుకోవడానికి అవకాశం లభించింది. అందుకే చిత్ర బృందం తెలివిగా ఆలోచించి థియేట్రికల్ రిలీజ్కు రెడీ అయింది. విదేశీ మార్కెట్ల ద్వారా ఈ చిత్ర వసూళ్లు వంద కోట్లు తగ్గవని.. ఇండియాలో పే పర్ వ్యూ పద్ధతిలో కోటి మంది ఈ సినిమా చూసినా వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 12, 2021 8:42 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…