‘వకీల్ సాబ్’ సినిమాకు గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పారితోషకం రూ.50 కోట్లు అని ముందుగా వార్తలు వస్తే దాని గురించి పెద్ద చర్చే జరిగింది. ఒక్క సినిమాకు యాభై కోట్లా అంటూ కొందరు గుండెలు బాదేసుకున్నారు. పవన్ను వ్యతిరేకించే మీడియా దీని గురించి నెగెటివ్ న్యూస్లు కూడా ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ విడుదల తర్వాత పవన్కు లాభాల్లో కూడా వాటా ఇచ్చారని, దీంతో మొత్తం పవన్కు రూ.65 కోట్ల దాకా ముట్టిందని కూడా అన్నారు. ఇదే నిజమైతే తెలుగులో ఇది రికార్డ్ అనడంలో సందేహం లేదు.
ఐతే పవన్కు ఆ స్థాయిలో రికార్డు స్థాయి పారితోషకం కట్టబెట్టిన నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమిళంలో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్ అనదగ్గ విజయ్తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తాజాగా అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం ఏకంగా విజయ్ ఏకంగా రూ.90 కోట్ల పారితోషకం పుచ్చుకోనున్నట్లు మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు కాగా.. అందులో 50 శాతం కంటే ఎక్కువగా విజయ్ పారితోషకానికే కేటాయించారట. విజయ్ తమిళంలో సైతం ఈ స్థాయిలో పారితోషకం తీసుకోలేదు. గత కొన్నేళ్లలో విజయ్ మార్కెట్ తెలుగులో పెరుగుతూ వస్తుండగా.. నేరుగా తెలుగు సినిమా చేయడం, దిల్ రాజు బ్రాండ్ కూడా జత కలుస్తుండటంతో ఈ చిత్రానికి తెలుగులోనే ఇక్కడ మిడ్ రేంజ్ సినిమాల స్థాయిలో బిజినెస్ జరగొచ్చు.
ఇక తమిళనాడు మార్కెట్కు ఎలాగూ ఢోకా ఉండదు. విజయ్కి కేరళ, కర్ణాటకల్లోనూ మాంచి మార్కెట్ ఉంది. ఓవర్సీస్ మార్కెట్ను కూడా కలుపుకుంటే ఈ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం, విజయ్కు ఇంత పారితోషకం ఇవ్వడం ఇబ్బందేమీ కాదు. ఐతే నిజంగా రాజు ఈ స్థాయిలో విజయ్కు పారితోషకం ఇస్తే మన బడా స్టార్లు తట్టుకోగలరా అన్నదే సందేహం. ఒక తమిళ స్టార్కు తెలుగు టాప్ ప్రొడ్యూసర్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం మన బడా స్టార్ల ఇగో దెబ్బ తినడం ఖాయం. మన స్టార్లు కూడా మున్ముందు పారితోషకాలు పెంచి కొత్త టార్గెట్ల మీద దృష్టిపెడతారేమో.
This post was last modified on May 11, 2021 6:34 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…