కొన్ని సినిమాలు అనుకున్నంత ఆడకపోయినా.. అందులో నటీనటులు, టెక్నీషియన్లకు మంచి పేరు తెచ్చి పెడుతుంటాయి. ‘అందాల రాక్షసి’ లాంటి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. ఈ సినిమా హీరో హీరోయిన్లు.. సంగీత దర్శకుడు.. అలాగే దర్శకుడు ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు అందుకోవడం తెలిసిందే. రెండేళ్ల కిందట విడుదలై పెద్ద డిజాస్టర్ అయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ద్వారా దాని సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఏకంగా ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’కు మ్యూజిక్ చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు రష్మిక ‘డియర్ కామ్రేడ్’ ద్వారానే కెరీర్ ఛేంజింగ్ ఛాన్స్ అందుకోవడం విశేషం. రష్మిక కొన్ని నెలల కిందటే ‘మిషన్ మజ్ను’ అనే భారీ హిందీ చిత్రానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు సంతకం చేసిన కొన్ని రోజులకే హిందీలో మరో సినిమా చేసే అవకాశాన్ని కూడా ఆమె చేజిక్కించుకుంది.
సిద్దార్థ్ రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ కోసం రష్మికను తీసుకోవడానికి కారణం.. ఆమె ‘డియర్ కామ్రేడ్’లో ఇచ్చిన పెర్ఫామెన్సే అని ఆ చిత్ర దర్శకుడు శాంతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సినిమాలో హీరోయిన్ అమాయకంగా కనిపించాలని.. అదే సమయంలో ఓ కీలక సన్నివేశంలో వేరియేషన్ చూపించాలని.. ‘డియర్ కామ్రేడ్’లో రష్మిక నటన చూశాక అలా డిఫరెంట్ షేడ్స్ చూపించగల సత్తా రష్మికకు ఉందనిపించిందని శాంతను చెప్పాడు.
నిజానికి ఈ సినిమా కోసం వేరే హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలించినప్పటికీ.. తాను కోరుకున్న పెర్ఫామెన్స్ రష్మికనే ఇవ్వగలదన్న నమ్మకం ‘డియర్ కామ్రేడ్’లో లిల్లీ పాత్రను చూస్తే కలిగిందని.. అందుకే ఈ సినిమాకు ఆమెను ఓకే చేశామని శాంతను తెలిపాడు. మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ కమర్షియల్గా చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ.. రష్మికకు ఈ రకంగా ఉపయోగపడిందన్నమాట.
This post was last modified on May 10, 2021 3:58 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…