Movie News

రాజేంద్రుడు గోల్డ్ మెడల్‌తో ఎన్టీవోడి దగ్గరికెళ్తే..

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. కామెడీకి ఒక స్థాయి తీసుకొచ్చి.. కామెడీతోనూ హీరోగా ఎదగొచ్చని రుజువు చేసిన ప్రత్యేకమైన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఐతే ఆయన తెరంగేట్రం, ఎదుగుదల అంత సాఫీగా ఏమీ సాగిపోలేదు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు నుంచే వచ్చినా, ఎన్టీఆర్ కుటుంబంతో తమ కుటుంబానికి పరిచయం ఉన్నా తాను కూడా కెరీర్ ఆరంభంలో చాలానే ఇబ్బందులు పడ్డట్లు రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తాను మద్రాసులోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని ఎన్టీఆర్‌ను కలిస్తే ఆయన అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగిపోయి అయోమయంలో పడ్డట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“నేను ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాసైనప్పటికీ నటనలోకి వెళ్లాలనుకుంటే మా నాన్నగారు మద్రాస్‌లోని పేరున్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. అక్కడ గోల్డ్ మెడల్ తీసుకుని ఎన్టీఆర్ గారిని కలిశాను. గోల్డ్ మెడల్ తీసుకున్నా కాబట్టి నేను నటన పట్ల సీరియస్‌గానే ఉన్నానని ఆయన అర్థం చేసుకున్నారు. కానీ తర్వాత ఆయనో ప్రశ్న అడిగారు. ‘రాముడు, కృష్ణుడు పాత్రలకు నన్ను అడుగుతారు. ఏవైనా సోషల్ సినిమాలుంటే ఏఎన్నార్ వైపు చూస్తారు. యాక్షన్ సినిమాలంటే కృష్ణ.. రొమాంటిక్ చిత్రాలంటే శోభన్ బాబు ఉన్నారు. ఇలా మా అందరికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇలా ప్రతి ఒక్కరికీ ఒక స్పెషాలిటీ ఉండాలి. మరి నీ ప్రత్యేకత ఏముంది? నిర్మాతలు దేని కోసం నీతో సినిమా తీయాలి’ అన్నారు.


ఆ మాటకు నాకు నోట మాట రాలేదు. గోల్డ్ మెడల్ తీసుకున్నానని గాల్లో తేలిపోతుంటే ఆయన నా నెత్తిన పెద్ద గుదిబండ వేశారు. దాంతో నాకు పిచ్చెక్కిపోయింది. వారం రోజుల పాటు పిచ్చోడిలా మద్రాస్ రోడ్ల వెంబడి తిరిగాను. అలాంటి సమయంలో నా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ సహచరులు చార్లి చాప్లిన్ సినిమా వారోత్సవాలకు తీసుకెళ్లారు. వారం పాటు ఆయన సినిమాలన్నీ చూశాను. అవి చూశాక నిర్ణయించుకున్నా. మనం కామెడీ సినిమాలు చేయాలి. మనం కామెడీ హీరోగా ఎందుకు పేరు తెచ్చుకోకూడదు అని. తర్వాత అవే చేసి పైకొచ్చా’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

6 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

32 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

33 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago