‘బాహుబలి’ దగ్గర్నుంచి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజిదే. ఐతే బాహుబలి అయినా.. ఆ తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అయినా బేసిగ్గా తెలుగు చిత్రాలే. ‘సలార్’ కూడా అంతే. ప్రాథమికంగా తెలుగులో తీసి, ఆ తర్వాత మిగతా భాషల్లోకి వాటిని విస్తరిస్తున్నారు. కానీ ‘ఆదిపురుష్’ అలా కాదు. అది బేసిగ్గా హిందీ సినిమా. దాన్ని తెరకెక్కిస్తున్నది బాలీవుడ్ దర్శకుడు. నిర్మాతలూ అక్కడి వాళ్లే. ముందుగా హిందీలో తీసి, ఆ తర్వాత ఇతర భాషల్లో డైలాగులు చెప్పించడం, లేదా అనువాదం చేయడం లాంటివి చేయబోతున్నారు.
అందుకనే ఈ చిత్రానికి బేస్ కూడా ముంబయిలోనే ఏర్పాటు చేసుకున్నారు. స్టూడియోలు, సెట్టింగులు అన్నీ కూడా అక్కడే ఏర్పాటయ్యాయి. ముంబయిలో ఒక పెద్ద స్టూడియోలో పెద్ద ఎత్తున ఫ్లోర్లు అద్దెకు తీసుకుని సెట్టింగ్స్ వేశారు. అలాగే ముంబయిలో సముద్రం పక్కన ఒక దీవి లాంటిది చూసుకుని అక్కడా షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వీరి ప్రణాళికలకు కరోనా అడ్డం పడింది. నెలలకు నెలలు ఎదురు చూసినా కూడా ముంబయిలో ఎక్కడా షూటింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.
దీంతో ఇక లాభం లేదని ‘ఆదిపురుష్’ టీం తమ బేస్ను హైదరాబాద్కు మార్చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు వేస్ట్ అయినా పర్వాలేదని.. మొత్తం టీం అంతా హైదరాబాద్కు వచ్చేయబోతోందట. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో, వేరే చోట్ల సెట్టింగ్స్ వేసుకుని షూటింగ్ చేసుకోవడానికి డిసైడైందట. మూడు నెలల పాటు అందరూ ఇక్కడే ఉండి మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ప్రస్తుతం బ్యాగ్రౌండ్ వర్క్ నడుస్తున్నట్లు సమాచారం. కరోనా ఉద్ధృతి కొంచెం తగ్గాక ఇక్కడ ‘ఆదిపురుష్’ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
This post was last modified on May 8, 2021 8:51 am
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…