కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఎదుటి వ్యక్తితో స్నేహపూర్వకంగా చేతులు కలపడానికి కూడా వీలులేకుండా పోయింది. ఇదే ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లకు కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. సినిమా అంటే హీరోహీరోయిన్ల మధ్య రొమన్స్ తప్పనిసరి. మిగిలిన భాషలతో పోలిస్తే మన సినిమాల్లో ఇలాంటి సీన్స్ తక్కువే.
అయితే కథలో ఎలా ఉన్నా, కనీసం పాటల్లో అయినా హత్తుకుపోయి, రొమాన్స్లో మునిగిపోతుంటారు టాలీవుడ్ హీరోహీరోయిన్లు. అయితే కరోనా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కానుంది. మరి ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ ఎలా తీయడం? ఇప్పటికే తైవాన్, యూకే లాంటి చాలాదేశాల్లో వెబ్, టీవీ షోలలో లిప్ లాక్ సీన్స్ను నిషేధించారట.
అడల్ట్ కంటెంట్ను మొహమాటం లేకుండా తెరకెక్కించే హాలీవుడ్లో కూడా రొమాంటిక్ సీన్స్ విషయంలో మార్పులు రాబోతున్నాయి. సినిమాల్లో ఇలాంటి సీన్స్ లేకపోతే ఓ వర్గం ప్రేక్షకులు బాగా డిస్సపాయింట్ అవుతారు. అలాగే కొన్ని కథలకు న్యాయం చేయాలంటే సినిమాలో ఇలాంటి సీన్స్ ఉండడం చాలా అవసరం.
అయితే హీరో సూర్య కోరిక మేరకు ‘బ్రదర్స్’ మూవీలో హీరోయిన్ లేకుండానే లిప్ లాక్ సీన్ తెరకెక్కించారు డైరెక్టర్. సినిమాలో ఈ సీన్స్ అచ్చు ఒరిజినల్గా ముద్దు పెట్టుకున్నట్టే ఉంటుంది. ఇకపై ప్రతీ సినిమా, వెబ్ సిరీస్ల్లో ఇలాగే రొమాంటిక్ సీన్స్ తీయాల్సి ఉంటుందేమో. ముద్దు సీన్ల వరకూ ఓకే కానీ, మిగిలిన సీన్లలో కూడా దూరంగా ఉండాలంటే చాలామంది యాక్టర్లు హార్ట్ అయ్యే అవకాశం ఉంది.
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…