రెండున్నరేళ్ల కిందట ఇండియన్ బాక్సాఫీస్లో ప్రభంజనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. ఓ కన్నడ సినిమా వివిధ భాషల్లో అలాంటి ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం ఆయా భాషల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతకంతకూ కలెక్షన్లు పెంచుకుని లాంగ్ రన్తో ఆశ్చర్యపరిచింది. యశ్ అన్ని భాషల్లో స్టార్ అయిపోయాడు.
‘బాహుబలి’ రెండో భాగం కోసం వివిధ భాషల ప్రేక్షకులు అప్పట్లో ఎలా ఎదురు చూశారో.. ‘కేజీఎఫ్-చాప్టర్:2’ కోసం కూడా ఇప్పుడు అలాగే ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఆడియన్స్. గత ఏడాది దసరాకే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. జులై 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ డేట్ను అందుకోవడానికి టీం గట్టిగానే కష్టపడుతోంది.
కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘సలార్’ షూటింగ్ చేస్తూనే దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. అవి చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుందని అంటున్నారు. కాగా ‘చాప్టర్-2’ ఫైనల్ కట్ నిడివి కొంచెం ఎక్కువే అన్నది చిత్ర వర్గాల సమాచారం. 2 గంటల 52 నిమిషాల రన్ టైంతో ‘కేజీఎఫ్-2’ను విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడట. చాప్టర్-1 విడుదలకు ముందే రెండో భాగానికి సంబంధించి సగం దాకా చిత్రీకరణ జరిగింది.
ఆ తర్వాత ఏడాది వ్యవధిలో మిగతా భాగమంతా చిత్రీకరించారు. రష్ మొత్తం ఎడిట్ చేశాక తుది నిడివి దాదాపు మూడు గంటలు వచ్చిందని.. అన్నీ ఆకర్షణీయంగా ఉండటంతో ఏ సన్నివేశాలూ తీసేయబుద్ధి కాలేదని.. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా నిడివి ఎక్కువ ఉన్నా చూస్తారని.. ఉన్న సన్నివేశాలను తీసేస్తే ఫ్లేవర్ పోతుందని.. కాబట్టి లెంగ్తీ రన్ టైంతోనే సినిమాను రిలీజ్ చేద్దామని ప్రశాంత్ ఫిక్సయ్యాడట. కాబట్టి దాదాపు మూడు గంటల పాటు కేజీఎఫ్ లోకంలో విహరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండాల్సిందే.
This post was last modified on May 4, 2021 7:30 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…