రెండున్నరేళ్ల కిందట ఇండియన్ బాక్సాఫీస్లో ప్రభంజనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. ఓ కన్నడ సినిమా వివిధ భాషల్లో అలాంటి ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం ఆయా భాషల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతకంతకూ కలెక్షన్లు పెంచుకుని లాంగ్ రన్తో ఆశ్చర్యపరిచింది. యశ్ అన్ని భాషల్లో స్టార్ అయిపోయాడు.
‘బాహుబలి’ రెండో భాగం కోసం వివిధ భాషల ప్రేక్షకులు అప్పట్లో ఎలా ఎదురు చూశారో.. ‘కేజీఎఫ్-చాప్టర్:2’ కోసం కూడా ఇప్పుడు అలాగే ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఆడియన్స్. గత ఏడాది దసరాకే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. జులై 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ డేట్ను అందుకోవడానికి టీం గట్టిగానే కష్టపడుతోంది.
కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘సలార్’ షూటింగ్ చేస్తూనే దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. అవి చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుందని అంటున్నారు. కాగా ‘చాప్టర్-2’ ఫైనల్ కట్ నిడివి కొంచెం ఎక్కువే అన్నది చిత్ర వర్గాల సమాచారం. 2 గంటల 52 నిమిషాల రన్ టైంతో ‘కేజీఎఫ్-2’ను విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడట. చాప్టర్-1 విడుదలకు ముందే రెండో భాగానికి సంబంధించి సగం దాకా చిత్రీకరణ జరిగింది.
ఆ తర్వాత ఏడాది వ్యవధిలో మిగతా భాగమంతా చిత్రీకరించారు. రష్ మొత్తం ఎడిట్ చేశాక తుది నిడివి దాదాపు మూడు గంటలు వచ్చిందని.. అన్నీ ఆకర్షణీయంగా ఉండటంతో ఏ సన్నివేశాలూ తీసేయబుద్ధి కాలేదని.. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా నిడివి ఎక్కువ ఉన్నా చూస్తారని.. ఉన్న సన్నివేశాలను తీసేస్తే ఫ్లేవర్ పోతుందని.. కాబట్టి లెంగ్తీ రన్ టైంతోనే సినిమాను రిలీజ్ చేద్దామని ప్రశాంత్ ఫిక్సయ్యాడట. కాబట్టి దాదాపు మూడు గంటల పాటు కేజీఎఫ్ లోకంలో విహరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండాల్సిందే.
This post was last modified on May 4, 2021 7:30 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…