పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, తమ కలయికలో రాబోతున్న తర్వాతి సినిమా గురించి ఇటీవల ఒక హరీష్ ఒక నోట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో చివర్లో ఇప్పుడే మొదలైంది అని హరీష్ పేర్కొనగా.. పవన్తో హరీష్ చేయబోయే కొత్త సినిమా టైటిల్ ఇదే అయ్యుండొచ్చనే ప్రచారం మొదలైంది. దీనిపై జోరుగా వార్తలు వచ్చాయి.
ఐతే హరీష్ శంకర్ ఈ వార్తల్ని ఖండించాడు. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్కు ముందు సీన్లో అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది అని పవన్ డైలాగ్ చెబుతాడని.. పవన్తో మరో సినిమాకు పని మొదలైన నేపథ్యంలోనే తాను నోట్లో ఇప్పుడే మొదలైంది అని పెట్టానని.. అంతే తప్ప అది సినిమా టైటిల్ కాదని హరీష్ స్పష్టం చేశాడు. మరోవైపు పవన్ సినిమాకు కథ దాదాపుగా పూర్తయినట్లు హరీష్ చెప్పడం అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్తే.
ఇక ఈ సినిమా కోసం మలయాళ అమ్మాయి మానస రాధాకృష్ణన్ను కథానాయికగా ఖరారు చేసినట్లు వస్తున్న వార్తల్ని హరీష్ ఖండించాడు. హీరోయిన్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఈ సినిమా గురించి ప్రస్తుత దశలో ఇంకేం చెప్పినా తొందరే అవుతుందని.. సినిమా మొదలయ్యే వరకు ఆగాలని కోరాడు హరీష్. ఈ చిత్రాన్ని పవన్తో కొన్నేళ్ల కిందటే కమిట్మెంట్ తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, క్రిష్ సినిమా తర్వాత పవన్ ఈ చిత్రంలో నటించనున్నాడు.
This post was last modified on May 14, 2020 1:51 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…