పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, తమ కలయికలో రాబోతున్న తర్వాతి సినిమా గురించి ఇటీవల ఒక హరీష్ ఒక నోట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో చివర్లో ఇప్పుడే మొదలైంది అని హరీష్ పేర్కొనగా.. పవన్తో హరీష్ చేయబోయే కొత్త సినిమా టైటిల్ ఇదే అయ్యుండొచ్చనే ప్రచారం మొదలైంది. దీనిపై జోరుగా వార్తలు వచ్చాయి.
ఐతే హరీష్ శంకర్ ఈ వార్తల్ని ఖండించాడు. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్కు ముందు సీన్లో అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది అని పవన్ డైలాగ్ చెబుతాడని.. పవన్తో మరో సినిమాకు పని మొదలైన నేపథ్యంలోనే తాను నోట్లో ఇప్పుడే మొదలైంది అని పెట్టానని.. అంతే తప్ప అది సినిమా టైటిల్ కాదని హరీష్ స్పష్టం చేశాడు. మరోవైపు పవన్ సినిమాకు కథ దాదాపుగా పూర్తయినట్లు హరీష్ చెప్పడం అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్తే.
ఇక ఈ సినిమా కోసం మలయాళ అమ్మాయి మానస రాధాకృష్ణన్ను కథానాయికగా ఖరారు చేసినట్లు వస్తున్న వార్తల్ని హరీష్ ఖండించాడు. హీరోయిన్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఈ సినిమా గురించి ప్రస్తుత దశలో ఇంకేం చెప్పినా తొందరే అవుతుందని.. సినిమా మొదలయ్యే వరకు ఆగాలని కోరాడు హరీష్. ఈ చిత్రాన్ని పవన్తో కొన్నేళ్ల కిందటే కమిట్మెంట్ తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, క్రిష్ సినిమా తర్వాత పవన్ ఈ చిత్రంలో నటించనున్నాడు.
This post was last modified on May 14, 2020 1:51 am
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…