Movie News

మహేష్-త్రివిక్రమ్.. లెక్కలు సరిచేయాలి


మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మూడో సినిమా రాబోతోంది. ఇది వాళ్లిద్దరి అభిమానులనూ ఎగ్జైట్ చేసే విషయమే. మామూలుగా హిట్ కాంబినేషన్ మీదే ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఐతే ఆశ్చర్యకరంగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి రెండు సినిమాలు కమర్షియల్‌గా నిరాశ పరిచినా సరే.. అంచనాలేమీ తక్కువగా లేవు. అందుక్కారణం వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ‘ఎవర్ గ్రీన్’ స్టేటస్ అందుకోవడమే.

తొలిసారిగా మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన ‘అతడు’ను తెలుగు సినీ చరిత్రలోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు. నిర్మాత మురళీ మోహన్‌కు కొంత మేర నష్టాలు కూడా తెచ్చింది. ఐతే థియేటర్లలో ఉన్నప్పుడు ఓ మోస్తరుగా ఆడిన సినిమా కాస్తా.. టీవీల్లోకి రాగానే విపరీతంగా జనాలను ఆకట్టుకోవడం మొదలైంది. ఇప్పటికీ ‘అతడు’ సినిమా టీవీల్లో వస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటారు జనాలు.

ఇక మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన రెండో సినిమా ‘ఖలేజా’ అయితే థియేటర్లలో డిజాస్టరే అయింది. భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఐతేనేం.. ఈ సినిమా సైతం టీవీల్లో, యూట్యూబ్‌లో తిరుగులేని ఆదరణ సంపాదించుకుని క్లాసిక్ స్టేటస్ తెచ్చుకోవడం విశేషం. ఐతే ఈసారి మాత్రం మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చే సినిమా ఈ కోవలో చేరకూడదని అభిమానులు బలంగా కోరుకుంటుున్నారు.

సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయాక క్లాసిక్ స్టేటస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని.. పెద్ద తెర మీదే ప్రేక్షకులను అలరించాలని.. కమర్షియల్‌గానూ మంచి విజయం సాధించి గత రెండు సినిమాల లోటును భర్తీ చేయాలని మహేష్, త్రివిక్రమ్ అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్, మహేష్ ఇద్దరూ కూడా ఇప్పుడు మంచి ఫాంలోనే ఉన్నారు. పైగా మంచి రికార్డున్న హారిక హాసిని బేనర్లో సినిమా తెరకెక్కుతోంది. కాబట్టి ఈసారి తప్పు జరగదని.. ఈ కాంబినేషన్ పాత లెక్కలన్నీ సరి చేయడం గ్యారెంటీ అనే ఆశిద్దాం.

This post was last modified on May 2, 2021 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

1 hour ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

3 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago