ఎప్పుడు విడుదల అవుతుందా అని ఈ సంవత్సరం ఎదురు చూసే చిత్రాల్లో మొదట వరసలో నిలబడేది “కేజీయఫ్ 2”. కరోనా గొడవ లేకపోతే ఈ సినిమా రిలీజ్ కు ముస్తాబు అవుతూండేది. లాక్ డౌన్, సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ ఇప్పుడు సినీ లవర్స్ ని ఉత్సాహ పరుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎలాగో అదిరిపోయాయి. ఈ విషయం పార్ట్ వన్ చూసిన వాళ్లకు వేరేగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇంకేదో కావాలి. అంతకు మించి ఉండకపోతే అబ్బే సినిమాలో ఏమీ లేదు అని తల తిప్పేస్తారు..పెదవి విరిచేస్తారు.
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఈ విషయం తెలుసు. అందుకే ఈ సారి సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కు థీటుగా రెండు ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేసారట. ఫస్టాఫ్ లో ఒకటి వస్తే సెకండాఫ్ లో మరొకటి వస్తుందిట. ఈ రెండు సాంగ్స్ లో ఒకదాంట్లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరొకదాంట్లో నోరా ఫతేహి చేయబోతోందిట. ఇందుకోసం స్పెషల్ గా కొరియోగ్రఫీని డిజైన్ చేయమని పురమాయించారట.
ఇవన్నీ చూస్తూంటే… ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఎవరూ ఊహించని, కనీ వినీ ఎరుగని ఫిగర్స్ ను భాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రోజు నమోదు చేయటం ఖాయం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి అగ్ర తారాగణంతో తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజరు దత్ అధీరా అనే పవర్ ఫుల్ రోల్లో నటిస్తుండగా హోంబేల్ ఫిల్మ్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా.
This post was last modified on May 1, 2021 7:59 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…