ఎప్పుడు విడుదల అవుతుందా అని ఈ సంవత్సరం ఎదురు చూసే చిత్రాల్లో మొదట వరసలో నిలబడేది “కేజీయఫ్ 2”. కరోనా గొడవ లేకపోతే ఈ సినిమా రిలీజ్ కు ముస్తాబు అవుతూండేది. లాక్ డౌన్, సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ ఇప్పుడు సినీ లవర్స్ ని ఉత్సాహ పరుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎలాగో అదిరిపోయాయి. ఈ విషయం పార్ట్ వన్ చూసిన వాళ్లకు వేరేగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇంకేదో కావాలి. అంతకు మించి ఉండకపోతే అబ్బే సినిమాలో ఏమీ లేదు అని తల తిప్పేస్తారు..పెదవి విరిచేస్తారు.
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఈ విషయం తెలుసు. అందుకే ఈ సారి సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కు థీటుగా రెండు ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేసారట. ఫస్టాఫ్ లో ఒకటి వస్తే సెకండాఫ్ లో మరొకటి వస్తుందిట. ఈ రెండు సాంగ్స్ లో ఒకదాంట్లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరొకదాంట్లో నోరా ఫతేహి చేయబోతోందిట. ఇందుకోసం స్పెషల్ గా కొరియోగ్రఫీని డిజైన్ చేయమని పురమాయించారట.
ఇవన్నీ చూస్తూంటే… ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఎవరూ ఊహించని, కనీ వినీ ఎరుగని ఫిగర్స్ ను భాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రోజు నమోదు చేయటం ఖాయం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి అగ్ర తారాగణంతో తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజరు దత్ అధీరా అనే పవర్ ఫుల్ రోల్లో నటిస్తుండగా హోంబేల్ ఫిల్మ్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా.
This post was last modified on May 1, 2021 7:59 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…