సీనియర్ కమెడియన్ వివేక్ మృతి తర్వాత కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కెవి ఆనంద్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కథలో వైవిధ్యం కోరుకునే దర్శకుల్లో ఆయన కూడా ఒకరు.
కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఒకేఒక్కడు, బాయ్స్, శివాజీ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగులో 1995లో పుణ్యభూమి నాదేశం అనే చిత్రం కోసం పనిచేశారు. 2005లో కెవి ఆనంద్ తొలిసారి దర్శకుడిగా మారి ‘కాన కందన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత మరోసారి దర్శకుడిగా స్టార్ హీరో సూర్యతో ‘అయాన్’ (తెలుగులో వీడోక్కడే) చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ ప్రతిభని అందరికీ తెలిసేలా చేసింది ఈ చిత్రమే.
ఆ తర్వాత ఆనంద్ తెరకెక్కించిన రంగం ఎంతటి ఘనవిజయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్యతో రెండవసారి తెరకెక్కించిన బ్రదర్స్ ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ దర్శకుడిగా ఆనంద్ అద్భుతమైన పనితనాన్ని చూపించారు. కెవి ఆనంద్ ఓ స్టార్ డైరెక్టర్ అని చెప్పడానికి ఈ మూడు చిత్రాలు చాలు.
చివరగా ఆనంద్ దర్శత్వం వహించిన చిత్రం కాప్పాన్. రంగం, వీడోక్కడే చిత్రాలని ప్రేక్షకులు ఇప్పటికి రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నారు. కెవి ఆనంద్ మృతితో ఆయనతో క్లోజ్ గా అసోసియేట్ ఐన హీరో సూర్య విషాదంలో మునిగిపోయారు. కోలీవుడ్ తో పాటు దక్షణాది సినీ ప్రముఖులంతా ఆనంద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…