కారోనా సెకండ్ వేవ్ మళ్ళీ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు రావడానికి భయపడిపోతున్న సిట్యువేషన్. దీనితో మళ్ళీ ఓటీటీ హవా మొదలైంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీగా సంచలనం సృష్టించిన ‘జాతిరత్నాలు’ ఏప్రిల్ 11నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూంటే… ఏప్రిల్ 14 నుంచి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగు అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కు కూడ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. అక్కడ ట్రెండింగ్ లో ఉంది.
ఇదే బాటలో ‘చావు కబురు చల్లగా’ కూడా ఓటీటీ లో బాగానే వచ్చింది. మరో ప్రక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వకీల్ సాబ్’ ఓటీటికి వచ్సేస్తున్నాడు. ఇలా ఎటుచూసినా ఓటీటీ కబుర్లే వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో మనకీ ఓ సొంత ఓటీటి సంస్ద ఉంటే బాగుంటుందనే ఆలోచన నాగార్జన కు వచ్చిందని సమాచారం.
తన స్నేహితులు కొందరితో కలిసి కొత్త తరహా ఓటీటికి సంబంధించి ఆయన ప్లాన్ చేస్తున్నట్లు వినపడుతోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వరసపెట్టి చిన్న సినిమాలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ యేడు మినిమం అరడజను సినిమాలు అయినా తన బ్యానర్ నుంచి రావాలని, అదీ ఫిల్మ్ స్టూడియో బ్యాచ్ కు ఆఫర్స్ ఇవ్వటానికి అని నాగ్ ప్లాన్ చేసారట. ఈ సినిమాలు అన్ని ఓటీటీల కోసమేనట. అయితే వేరే ఓటీటి లకు ఇవ్వటం ఎందుకు..తనకే ఒకటి ఉంటే ఇంకాస్త స్పీడుగా సినిమాలు చేయచ్చు అని భావిస్తున్నారట. అందులోనూ తమ కుటుంబంలోనే ముగ్గురు హీరోలు ఉన్నారు. వాళ్ల సినిమాలు సొంత ఓటీటి ఉంటే రెమ్యునేషన్ లో భాగంగా రైట్స్ అడగొచ్చు అని నాగ్ ఆలోచనగా చెప్తున్నారు.
వైల్డ్ డాగ్ సినిమా ఓటీటిలో హిట్ అవ్వటం నాగ్ కు ఉత్సాహాన్ని ఇచ్చి ఓటీటిపై దృష్టి పడేలా చేసిందిట. ఇప్పటికే ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ.. మొదటిసారి ప్రాంతీయ భాషకు పెద్ద పీఠ వేస్తూ వచ్చిందే ‘ఆహా‘ ఓటీటీ. అప్పటి వరకు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్లకే పరిమితమైన ఓటీటీ రంగంలోకి ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకొచ్చింది ‘ఆహా’ ఓటీటీ.ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు మరోవైపు ‘సామ్జామ్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళుతోంది. మరి నాగ్ ప్లాన్ చేసే ఓటీటిలో ఏం కొత్తదనం ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on April 30, 2021 8:27 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…