సున్నితమైన కథాంశాలకు పెట్టింది పేరు శేఖర్ కమ్ముల. ఆయన చిత్రాల్లో భావోద్వేగాలు, వినోదం అన్నీ ఉంటాయి. కానీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల తరహాలో ఉండవు. అందుకే శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన దర్శకుడు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలని సూపర్ హిట్ చేస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నారు.
ఒక్క స్టార్ హీరో కూడా శేఖర్ కమ్ములతో ఇంతవరకు సినిమా చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ హంగులు ఆయన చిత్రాల్లో లేకపోవడమే కారణం. మహేష్, రాంచరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి శేఖర్ కమ్ముల గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రస్తుతం కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఓ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథ సిద్ధం చేసుకుంటున్నారట.
కమ్ముల సిద్ధం చేసుకుంటున్న కథ ఏంటి.. ఆ స్టార్ హీరో ఎవరు అనే చర్చ ఇండస్ట్రీలో మొదలయింది. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే శేఖర్ కమ్ముల తన శైలిని ఎంతోకొంత మార్చుకోక తప్పదు. కానీ కమ్ముల అలా చేస్తారా అనేది ప్రశ్న. అలాగే లవ్ స్టోరీ సక్సెస్ పై కూడా కమ్ముల తదుపరి చిత్రం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on April 29, 2021 2:14 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…