హీరో నితిన్ ప్రేమకథ చేసిన ప్రతిసారి మంచి ఫలితాలని రాబట్టాడు. ప్రయోగాలు నితిన్ కు పెద్దగా కలసి రాలేదు. కానీ వరుసగా ప్రేమ కథలు చేయడం తనకు బోర్ కొట్టేసిందని నితిన్ పలు సందర్భాల్లో తెలిపాడు. ఇకపై కథల ఎంపికలో సెలెక్టివ్ గా ఉండబోతున్నట్లు గతంలో చెప్పుకొచ్చాడు. విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తాడట.
విభిన్న కథాంశంతో ఈ ఏడాది నితిన్ నుంచి వచ్చిన చెక్ చిత్రం నిరాశపరిచింది. రంగ్ దే మాత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ మాస్ట్రోలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నితిన్ ఓ డిఫెరెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
యాత్ర చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. మహి వినిపించిన కథ నితిన్ కు బాగా నచ్చిందట. కథ పరంగా నితిన్ పోలీస్ అధికారిగా నటించాలి. కథలో నితిన్ సోదరుడి పాత్ర కూడా పోలీసే. కథాచర్చలు పూర్తయ్యాయి కాబట్టి త్వరలో అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు టాక్.
మహి వి. రాఘవ్.. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాలతో గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో విడుదలైన యాత్ర చిత్రం రాఘవ్ కు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. నితిన్ తో తెరకెక్కించబోయే చిత్రం కమర్షియల్ డైరెక్టర్ గా కూడా ఎస్టాబ్లిష్ కావాలని రాఘవ్ ప్రయత్నిస్తున్నాడు.
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…