హీరో నితిన్ ప్రేమకథ చేసిన ప్రతిసారి మంచి ఫలితాలని రాబట్టాడు. ప్రయోగాలు నితిన్ కు పెద్దగా కలసి రాలేదు. కానీ వరుసగా ప్రేమ కథలు చేయడం తనకు బోర్ కొట్టేసిందని నితిన్ పలు సందర్భాల్లో తెలిపాడు. ఇకపై కథల ఎంపికలో సెలెక్టివ్ గా ఉండబోతున్నట్లు గతంలో చెప్పుకొచ్చాడు. విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తాడట.
విభిన్న కథాంశంతో ఈ ఏడాది నితిన్ నుంచి వచ్చిన చెక్ చిత్రం నిరాశపరిచింది. రంగ్ దే మాత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ మాస్ట్రోలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నితిన్ ఓ డిఫెరెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
యాత్ర చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. మహి వినిపించిన కథ నితిన్ కు బాగా నచ్చిందట. కథ పరంగా నితిన్ పోలీస్ అధికారిగా నటించాలి. కథలో నితిన్ సోదరుడి పాత్ర కూడా పోలీసే. కథాచర్చలు పూర్తయ్యాయి కాబట్టి త్వరలో అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు టాక్.
మహి వి. రాఘవ్.. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాలతో గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో విడుదలైన యాత్ర చిత్రం రాఘవ్ కు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. నితిన్ తో తెరకెక్కించబోయే చిత్రం కమర్షియల్ డైరెక్టర్ గా కూడా ఎస్టాబ్లిష్ కావాలని రాఘవ్ ప్రయత్నిస్తున్నాడు.
This post was last modified on April 29, 2021 2:11 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…