మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చాన్నాళ్ల నుంచే ఇండస్ట్రీలో ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్గా చిరుతో పాటు చరణ్ సినిమాలు కొన్నింటికి ఆమె పని చేయడం తెలిసిందే. గత ఏడాది సుస్మిత నిర్మాతగానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బేనర్ పెట్టి భర్త విష్ణుతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది.
షూటౌట్ అట్ ఆలేరు పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ జీ స్టూడియోస్ వాళ్ల ఓటీటీలో రిలీజై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ఇప్పుడిక సుస్మిత సినిమా నిర్మాణానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆమె నిర్మాణంలో రాబోయే తొలి చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఓ తమిళ చిత్రం రీమేక్ హక్కులను సుస్మిత సొంతం చేసుకుందన్నది తాజా కబురు.
8 తొట్టకల్.. తమిళంలో నాలుగేళ్ల కిందట విడుదలై మంచి విజయం సాధించిన చిన్న సినిమా. వెట్రి అనే కొత్త హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఆకాశం నీ హద్దురాతో ఆకట్టుకున్న అపర్ణ బాలమురళి కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాల్లో ఇదొకటి. శ్రీ గణేష్ అనే దర్శకుడు రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఓ పాత జపనీస్ మూవీ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు. ఇందులో హీరో అయిన పోలీస్.. ఒక నేరస్థుడిని పట్టుకునే క్రమంలో తన రివాల్వర్ కోల్పోతాడు.
దాన్ని దొంగిలించిన వ్యక్తి మరొకరికి దాన్ని అమ్ముతాడు. దీంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో రీమేక్ చేయగా.. అక్కడా హిట్టయింది. ఇప్పుడు సుస్మిత ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసిందట. ఎవరో ఒక యువ కథానాయకుడితోనే ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. మెగా ఫ్యామిలీలోనే చాలామంది యంగ్ హీరోలున్నారు కాబట్టి వాళ్లలోనే ఎవరో ఒకరు ఈ సినిమా చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 27, 2021 7:41 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…