మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చాన్నాళ్ల నుంచే ఇండస్ట్రీలో ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్గా చిరుతో పాటు చరణ్ సినిమాలు కొన్నింటికి ఆమె పని చేయడం తెలిసిందే. గత ఏడాది సుస్మిత నిర్మాతగానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బేనర్ పెట్టి భర్త విష్ణుతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది.
షూటౌట్ అట్ ఆలేరు పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ జీ స్టూడియోస్ వాళ్ల ఓటీటీలో రిలీజై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ఇప్పుడిక సుస్మిత సినిమా నిర్మాణానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆమె నిర్మాణంలో రాబోయే తొలి చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఓ తమిళ చిత్రం రీమేక్ హక్కులను సుస్మిత సొంతం చేసుకుందన్నది తాజా కబురు.
8 తొట్టకల్.. తమిళంలో నాలుగేళ్ల కిందట విడుదలై మంచి విజయం సాధించిన చిన్న సినిమా. వెట్రి అనే కొత్త హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఆకాశం నీ హద్దురాతో ఆకట్టుకున్న అపర్ణ బాలమురళి కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాల్లో ఇదొకటి. శ్రీ గణేష్ అనే దర్శకుడు రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఓ పాత జపనీస్ మూవీ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు. ఇందులో హీరో అయిన పోలీస్.. ఒక నేరస్థుడిని పట్టుకునే క్రమంలో తన రివాల్వర్ కోల్పోతాడు.
దాన్ని దొంగిలించిన వ్యక్తి మరొకరికి దాన్ని అమ్ముతాడు. దీంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో రీమేక్ చేయగా.. అక్కడా హిట్టయింది. ఇప్పుడు సుస్మిత ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసిందట. ఎవరో ఒక యువ కథానాయకుడితోనే ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. మెగా ఫ్యామిలీలోనే చాలామంది యంగ్ హీరోలున్నారు కాబట్టి వాళ్లలోనే ఎవరో ఒకరు ఈ సినిమా చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 27, 2021 7:41 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…