కొన్ని రోజుల హడావుడి తర్వాత ఈ రోజే హిందీలో ‘సీటీమార్’ పాటను రిలీజ్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధె’లోని పాట ఇది. తెలుగులో ‘దువ్వాడ జగన్నాథం’లో సూపర్ హిట్టయిన ‘సీటీమార్’ పాట ట్యూన్ను హిందీలో యాజిటీజ్గా వాడేశారు. ఒరిజినల్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాదే ఈ పాటను కూడా తీర్చిదిద్దాడు. కొన్ని రోజుల కిందట ‘రాధె’ ట్రైలర్లోనే ‘సీటీమార్’ గ్లింప్స్ చూపించారు.
ఇప్పుడు ఈ పాట వీడియోను పూర్తిగా యూట్యూబ్లో రిలీజ్ చేసేయడం విశేషం. ఈ పాట గురించి కొన్ని రోజులుగా చిత్ర బృందం మామూలుగా హైప్ ఇవ్వట్లేదు. చివరికి ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయగా.. దాన్ని చూసిన వాళ్లలో మెజారిటీ పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ‘డీజే’లోని సీటీమార్ పాట చూసిన వాళ్లకు ఇది అస్సలు రుచించట్లేదు. సల్మాన్ వీరాభిమానులు సూపరో సూపర్ అని పొగిడేస్తున్నారు కానీ.. సగటు ప్రేక్షకులు మాత్రం ఇందులో సల్మాన్ స్టెప్పుల పట్ల ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయట్లేదు.
తెలుగు ‘సీటీమార్’లో బన్నీ వేసిన స్టెప్పుల ముందు హిందీలో సల్మాన్ వేసిన డ్యాన్సులు తేలిపోయాయి. బన్నీ వేగాన్ని సల్మాన్ అందుకోగలడని ఎవరికీ ఆశల్లేవు. కానీ స్లోగా అయినా మంచి స్టెప్పులు వేసి ఉంటాడని అనుకుంటే.. అతను తుస్సుమనిపించేశాడు. టీషర్ట ముఖం మీద కప్పుకుని వేసిన స్టెప్ మరీ కామెడీగా ఉంది. అసలు సీటీమార్ సీటీమార్ అనేటపుడు డ్యాన్సే లేకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సైతం తేలిపోయింది. సల్మాన్, బన్నీ స్టెప్పులను పోలుస్తూ అప్పుడే వీడియోలు కూడా రెడీ అయిపోయాయి. ఇవి పెట్టి సల్మాన్ను ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు సీటీమార్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన జాని మాస్టరే హిందీలోనూ నృత్య రీతులు సమకూర్చాడు. కానీ సల్మాన్ అతడికి సహకరించినట్లు లేడు. లేదా సల్మాన్ వల్ల కాదులే అని సింపుల్గా ట్రై చేసినట్లున్నాడు కానీ.. పాటలో ఉన్న ఊపు డ్యాన్సుల్లో లేక ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కాస్తో కూస్తో ఈ పాటకు ఊపు తెచ్చింది హీరోయిన్ దిశా పఠానినే. ఆమె స్టెప్పులకు తోడు గ్లామర్ ఈ పాటకు ఆకర్షణగా నిలిచింది.
This post was last modified on April 26, 2021 2:30 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…