క్రేజీ సినిమాలు మేకింగ్ దశలో ఉండగా.. అందులోని సన్నివేశాలను పాటలను ఆన్ లైన్లో లీక్ చేసేయడం పెద్ద బెడదగా మారిపోతోంది ఈ మధ్య. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఎంత కట్టడి చేసినప్పటికీ.. సినిమాలోని కంటెంట్ను బయటపెట్టేయడం జరుగుతోంది. ‘బాహుబలి’ నుంచి ‘వకీల్ సాబ్’ దాకా చాలా చిత్రాలకు ఈ సమస్య తప్పలేదు. ఇప్పుడు ‘ఆచార్య’ టీంకు లీక్ దెబ్బ తాకింది. ఆ సినిమా నుంచి ఒక పాట బయటికి వచ్చేసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యే వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో పూజా పాత్ర పేరు నీలాంబరి అని ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పేరు మీదే పాటను తీర్చిదిద్దారు. ఆ నీలాంబరి పాటే ఇప్పుడు ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఎవరు, ఎలా లీక్ చేశారన్నది తెలియట్లేదు కానీ.. ఈ పాట విన్నవాళ్లందరూ చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది ట్రెండ్ అవుతోంది. ఈపాటికి ‘ఆచార్య’ సినిమాలో చరణ్, పూజా హెగ్డే పార్ట్ అంతా షూటింగ్ అయిపోవాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది.
తాజాగా పూజా కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు. ఆమెతో కలిసి పని చేసిన వాళ్లందరూ కూడా పరీక్షలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే మే 13న ‘ఆచార్య’ విడుదల కావాల్సింది. కానీ అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయక తప్పట్లేదు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. జూన్ లేదా జులైకి సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణే నిర్మిస్తున్నాడు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…