సుక్కు స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు సానా నిస్సందేహంగా ప్రతిభగల దర్శకుడు. ఉప్పెన చిత్రంతోనే అతడికి ఫుల్ మార్క్స్ పడిపోయాయి. దిగువ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన బుచ్చిబాబు సుకుమార్ అండదండలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అందివచ్చిన తొలి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరక్కించిన దర్శకుడిపై సహజంగానే కొన్ని పుకార్లు పుట్టుకువస్తాయి. తాజాగా అతడి రెమ్యునరేషన్ గురించి ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. కానీ అది అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. బుచ్చిబాబు తన తదుపరి చిత్రం నుంచి రూ.8 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది.
ఉప్పెన తర్వాత ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో బుచ్చిబాబుపై హైప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని అనిపించక మానదు. ఉప్పెన విజయం తర్వాత సుకుమార్ తన ప్రియ శిష్యుడికి కారుని బహుమతిగా ఇచ్చాడు. బుచ్చిబాబు కుటుంబ నేపథ్యం దృష్ట్యా సుకుమార్, మైత్రి సంస్థ ఆర్థికంగా బుచ్చిబాబుకి హెల్పింగ్ హ్యాండ్ అందించి ఉంటుందనేది ఓ అజంప్షన్.
ఇతర నిర్మాణ సంస్థలు కూడా ఓ మంచి ఆఫర్ తో బుచ్చిబాబు వెంటపడుతుండొచ్చు. కానీ ఏకంగా 8 కోట్ల పారితోషికం అనే వార్త ఓ గాసిప్ మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బుచ్చిబాబు తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా బుచ్చిబాబు మరో కొత్త చిత్రానికి ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
This post was last modified on April 24, 2021 11:13 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…