సుక్కు స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు సానా నిస్సందేహంగా ప్రతిభగల దర్శకుడు. ఉప్పెన చిత్రంతోనే అతడికి ఫుల్ మార్క్స్ పడిపోయాయి. దిగువ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన బుచ్చిబాబు సుకుమార్ అండదండలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అందివచ్చిన తొలి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరక్కించిన దర్శకుడిపై సహజంగానే కొన్ని పుకార్లు పుట్టుకువస్తాయి. తాజాగా అతడి రెమ్యునరేషన్ గురించి ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. కానీ అది అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. బుచ్చిబాబు తన తదుపరి చిత్రం నుంచి రూ.8 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది.
ఉప్పెన తర్వాత ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో బుచ్చిబాబుపై హైప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని అనిపించక మానదు. ఉప్పెన విజయం తర్వాత సుకుమార్ తన ప్రియ శిష్యుడికి కారుని బహుమతిగా ఇచ్చాడు. బుచ్చిబాబు కుటుంబ నేపథ్యం దృష్ట్యా సుకుమార్, మైత్రి సంస్థ ఆర్థికంగా బుచ్చిబాబుకి హెల్పింగ్ హ్యాండ్ అందించి ఉంటుందనేది ఓ అజంప్షన్.
ఇతర నిర్మాణ సంస్థలు కూడా ఓ మంచి ఆఫర్ తో బుచ్చిబాబు వెంటపడుతుండొచ్చు. కానీ ఏకంగా 8 కోట్ల పారితోషికం అనే వార్త ఓ గాసిప్ మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బుచ్చిబాబు తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా బుచ్చిబాబు మరో కొత్త చిత్రానికి ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…