గత ఏడాది కరోనా విరామం తీసుకొచ్చిన బలవంతపు విరామం తర్వాత ఇండియాలో రిలీజైన అతి పెద్ద సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. తెలుగులో అయితే గత ఏడాది కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ఇదే. రెండు వారాల కిందటే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే సినిమా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
తొలి వారంలో ఈ చిత్రం అంచనాలను మించి ఆడేసింది. రెండో వారంలో సినిమా నిలబడలేకపోయింది. కరోనా తీవ్రత బాగా పెరిగిపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. ఇక ‘వకీల్ సాబ్’ డిజిటల్ రిలీజ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్లో మే 7న విడుదల కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
‘వకీల్ సాబ్’ డిజిటల్ హక్కులను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు అమేజాన్ ప్రైమ్కు అమ్మేసిన సంగతి తెలిసిందే. భారీ మొత్తానికే డీల్ అయింది. సినిమా టైటిల్ కార్డ్స్లో కూడా డిజిటల్ పార్ట్నర్గా ప్రైమ్ పేరు పడుతుంది. ఈ సినిమా థియేటర్లలో ఉండగా.. ఈ నెల 23నే ప్రైమ్లోకి వచ్చేస్తోందంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ అది అవాస్తవం అంటూ నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలన్నరకే ఈ సినిమా ప్రైమ్లో వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది.
సినిమాకు థియేటర్లలో అనుకున్నంత లాంగ్ రన్ లేకపోవడంతో ఒప్పందాన్ని మారుస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడే పరిస్థితి రావడంతో సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందులో భాగంగానే మే 7కు ప్రిమియర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
This post was last modified on April 23, 2021 3:35 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…