Movie News

బాలీవుడ్ నటుడి హఠాన్మరణం

గత ఏడాది కాలంలో భారతీయ సినీ పరిశ్రమ ఎంతో మంది మంచి నటీనటులను, టెక్నీషియన్లను కోల్పోయింది. కరోనా వల్ల కొందరు.. వేరే అనారోగ్య కారణాల వల్ల మరికొందరు.. మొత్తంగా గత ఏడాది కాలంలో మునుపెన్నడూ లేనంతగా సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మరో మంచి నటుడిని కోల్పోయింది. ఆ నటుడి పేరు.. అమిత్ మిస్త్రీ.

గురువారం మిస్త్రీకి తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. అది అతడి ప్రాణాలనే కబళించింది. ముంబయిలోని అంధేరిలో తన ఇంట్లో ఉండగా.. గుండెపోటుతో కుప్పకూలిపోయిన మిస్త్రీ.. కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు వదిలాడని.. అతణ్ని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని తెలిసింది. మంచి నటుడైన మిస్త్రీ చిన్న వయసులో ఇలా హఠాత్తుగా చనిపోవడం హిందీ ప్రేక్షకులను కలచి వేస్తోంది.

గత ఏడాది అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందన రాబట్టుకున్న ‘బాండిష్ బండిట్స్’ చూసిన వాళ్లు ఎవరూ అమిత్ మిస్త్రీని మరిచిపోలేరు. అందులో దేవేంద్ర రాథోడ్ అనే పాత్రలో అమిత్ మెరిశాడు. సంగీత ప్రధానంగా సాగే ఈ సిరీస్‌లో మిస్త్రీ పాత్ర, అతడి నటన ఆద్యంతం ఆకట్టుకుంటాయి. థియేటర్ ఫీల్డ్ నుంచి నుంచి వచ్చిన మిస్త్రీ.. ముందు టెలివిజన్లో సత్తా చాటుకున్నాడు. తెనాలి రామ టీవీ సిరీస్ అతడికి చాలా మంచి పేరు తెచ్చింది. ఇది కాక దాదాపు పది టీవీ సిరీస్‌ల్లో అతను నటించాడు. తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించాడు.

తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’తో అతడికి మంచి పేరు వచ్చింది. తర్వాత ‘యామ్లా పాగ్లా దీవానా’; ‘గలి గలి చోర్ హై’, ‘బే యార్’, ‘ఎ జెంటిల్‌మ్యాన్’ లాంటి సినిమాల్లో నటించాడు. అతను నటించిన ‘భూత్ పోలీస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పటిదాకా చేసిన సినిమాల కంటే కూడా ‘బాండిష్ బండిట్స్‌’యే మిస్త్రీకి ఎక్కువ పేరు తెచ్చింది.

This post was last modified on April 23, 2021 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

38 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago