Movie News

బాలీవుడ్ నటుడి హఠాన్మరణం

గత ఏడాది కాలంలో భారతీయ సినీ పరిశ్రమ ఎంతో మంది మంచి నటీనటులను, టెక్నీషియన్లను కోల్పోయింది. కరోనా వల్ల కొందరు.. వేరే అనారోగ్య కారణాల వల్ల మరికొందరు.. మొత్తంగా గత ఏడాది కాలంలో మునుపెన్నడూ లేనంతగా సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మరో మంచి నటుడిని కోల్పోయింది. ఆ నటుడి పేరు.. అమిత్ మిస్త్రీ.

గురువారం మిస్త్రీకి తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. అది అతడి ప్రాణాలనే కబళించింది. ముంబయిలోని అంధేరిలో తన ఇంట్లో ఉండగా.. గుండెపోటుతో కుప్పకూలిపోయిన మిస్త్రీ.. కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు వదిలాడని.. అతణ్ని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని తెలిసింది. మంచి నటుడైన మిస్త్రీ చిన్న వయసులో ఇలా హఠాత్తుగా చనిపోవడం హిందీ ప్రేక్షకులను కలచి వేస్తోంది.

గత ఏడాది అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందన రాబట్టుకున్న ‘బాండిష్ బండిట్స్’ చూసిన వాళ్లు ఎవరూ అమిత్ మిస్త్రీని మరిచిపోలేరు. అందులో దేవేంద్ర రాథోడ్ అనే పాత్రలో అమిత్ మెరిశాడు. సంగీత ప్రధానంగా సాగే ఈ సిరీస్‌లో మిస్త్రీ పాత్ర, అతడి నటన ఆద్యంతం ఆకట్టుకుంటాయి. థియేటర్ ఫీల్డ్ నుంచి నుంచి వచ్చిన మిస్త్రీ.. ముందు టెలివిజన్లో సత్తా చాటుకున్నాడు. తెనాలి రామ టీవీ సిరీస్ అతడికి చాలా మంచి పేరు తెచ్చింది. ఇది కాక దాదాపు పది టీవీ సిరీస్‌ల్లో అతను నటించాడు. తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించాడు.

తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’తో అతడికి మంచి పేరు వచ్చింది. తర్వాత ‘యామ్లా పాగ్లా దీవానా’; ‘గలి గలి చోర్ హై’, ‘బే యార్’, ‘ఎ జెంటిల్‌మ్యాన్’ లాంటి సినిమాల్లో నటించాడు. అతను నటించిన ‘భూత్ పోలీస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పటిదాకా చేసిన సినిమాల కంటే కూడా ‘బాండిష్ బండిట్స్‌’యే మిస్త్రీకి ఎక్కువ పేరు తెచ్చింది.

This post was last modified on April 23, 2021 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

4 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

5 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

7 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago