అధికార వర్గాలు ఎక్కడైనా ప్రభుత్వ పెద్దల మనసును అర్థం చేసుకుని నడుచుకుంటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే రెండేళ్ల నుంచి అధికార యంత్రాంగం మరింతగా ప్రభుత్వాధినేత మనసు తెలుసుకుని నడుచుకుంటుండటం గమనించవచ్చు. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎలా వ్యవహరించారో అందరూ చూశారు.
అధికార పార్టీ బద్ధ శత్రువుగా పరిగణించే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవడంతో అంతకుముందు ఎప్పుడూ పట్టించుకోని టికెట్ల ధరల వ్యవహారంపై దృష్టి సారించారు. రేట్లపై నియంత్రణ తెచ్చారు. ఎప్పుడో దశాబ్దం కిందటి ధరల పట్టికను బయటికి తెచ్చి ఆ ప్రకారమే టికెట్లు అమ్మాలని హుకుం జారీ చేశారు. ఈ విషయంలో ఎక్కడ లేని పట్టుదల చూపించారు. ఐతే ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇప్పుడు థియేటర్ల వ్యవస్థ గురించి పట్టించుకునేవాళ్లు లేరు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఏపీలోని అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించాలని రెండు రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐతే ఏపీలోని థియేటర్లలో ఈ నిర్ణయం ఇప్పటిదాకా అమలు కాలేదు. టికెట్ బుకింగ్ యాప్ప్ పరిశీలిస్తే సీటు వదిలి సీటు నింపడం లాంటిదేమీ జరగట్లేదు. వంద శాతం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఐతే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సహా ఏ సినిమాకూ కలెక్షన్లు లేని మాట వాస్తవం. పవన్ సినిమా కూడా నామమాత్రంగా నడుస్తోంది.
ఒకవేళ ఆ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్స్తో రన్ అవుతున్నట్లయితే అత్యవసరంగా అధికార వర్గాలు ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడానికి చూసేవాళ్లేమో. కానీ ఇప్పుడు మాత్రం సీఎం మాటను కూడా పట్టించుకోకుండా 50 ఆక్యుపెన్సీ అమలు చేయించడంపై దృష్టి సారించట్లేదు. తెలంగాణలో సైతం 50 శాతం ఆక్యుపెన్సీకి ఆదేశాలున్నప్పటికీ దాన్ని థియేటర్లలో అమలు చేయకపోవడం గమనార్హం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…