Movie News

జగన్ మాటంటే లెక్కలేదా?

అధికార వర్గాలు ఎక్కడైనా ప్రభుత్వ పెద్దల మనసును అర్థం చేసుకుని నడుచుకుంటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే రెండేళ్ల నుంచి అధికార యంత్రాంగం మరింతగా ప్రభుత్వాధినేత మనసు తెలుసుకుని నడుచుకుంటుండటం గమనించవచ్చు. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎలా వ్యవహరించారో అందరూ చూశారు.

అధికార పార్టీ బద్ధ శత్రువుగా పరిగణించే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవడంతో అంతకుముందు ఎప్పుడూ పట్టించుకోని టికెట్ల ధరల వ్యవహారంపై దృష్టి సారించారు. రేట్లపై నియంత్రణ తెచ్చారు. ఎప్పుడో దశాబ్దం కిందటి ధరల పట్టికను బయటికి తెచ్చి ఆ ప్రకారమే టికెట్లు అమ్మాలని హుకుం జారీ చేశారు. ఈ విషయంలో ఎక్కడ లేని పట్టుదల చూపించారు. ఐతే ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇప్పుడు థియేటర్ల వ్యవస్థ గురించి పట్టించుకునేవాళ్లు లేరు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఏపీలోని అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించాలని రెండు రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐతే ఏపీలోని థియేటర్లలో ఈ నిర్ణయం ఇప్పటిదాకా అమలు కాలేదు. టికెట్ బుకింగ్ యాప్ప్ పరిశీలిస్తే సీటు వదిలి సీటు నింపడం లాంటిదేమీ జరగట్లేదు. వంద శాతం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఐతే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సహా ఏ సినిమాకూ కలెక్షన్లు లేని మాట వాస్తవం. పవన్ సినిమా కూడా నామమాత్రంగా నడుస్తోంది.

ఒకవేళ ఆ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతున్నట్లయితే అత్యవసరంగా అధికార వర్గాలు ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడానికి చూసేవాళ్లేమో. కానీ ఇప్పుడు మాత్రం సీఎం మాటను కూడా పట్టించుకోకుండా 50 ఆక్యుపెన్సీ అమలు చేయించడంపై దృష్టి సారించట్లేదు. తెలంగాణలో సైతం 50 శాతం ఆక్యుపెన్సీకి ఆదేశాలున్నప్పటికీ దాన్ని థియేటర్లలో అమలు చేయకపోవడం గమనార్హం.

This post was last modified on April 23, 2021 3:33 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

48 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

51 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

52 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago